నల్గొండలో ఓ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్గొండ: నిడమానూరులో గురువారం 55 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను నిడమానూరులో సమీపంలోని మండలానికి చెందిన బాధితురాలైన కూలీ ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది. నిందితులు తమతో పాటు వెళ్లి కల్లు తాగమని ఇద్దరు మహిళను ఒప్పించారు. వారి మాయమాటలతో ఆమె వారితో కలిసి కల్లు తాగడానికి ఒకే చెప్పింది ఈ క్రమంలోనే వారు కల్లు కొనుగోలు చేసి.. సమీపంలోని ఏవరూలేని ప్రాంతంలో కల్లు తాగారు. ఈ క్రమంలోనే సదరు మహిళను ఆ ఇద్దరు వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. లైంగికదాడి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. తనను హత్య చేయడానికి కూడా ప్రయత్నించారనీ, తాను వారి నుంచి తప్పించుకున్నానని తెలిపింది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నామని తెలిపారు. కల్లు తాగి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆ మహిళ ఆరోపించింది. ఇద్దరు పురుషులు తనను గొంతు కోసేందుకు ప్రయత్నించారని, అయితే ఆమె వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయిందని అధికారులు తెలిపారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు పట్టుకోగా, వారిలో ఒకరు అత్యాచారానికి తాను పాల్పడలేదని పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతున్నదని తెలిపారు.
మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వార్డెన్..
ఏడుగురు మైనర్ బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వార్డెన్. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ ఏడుగురు మైనర్ బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం ప్రాంతానికి చెందిన కృష్ణ (32) హిమాయత్నగర్లోని శ్రీ చైతన్య స్కూల్లోని హాస్టల్లో వార్డెన్గా చేరాడు. అయితే, అబ్బాయిలతో కలిసి నిద్రించేవాడు. ఈ క్రమంలోనే రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు బాలురను అనుచితంగా తాకుతూ.. వారిని లైంగిక వేధింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు. వార్డెన్ తీరును తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే అతడిని విధుల నుంచి తొలగించారు. అనంతరం హిమాయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వార్డెన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటికే ఆ వార్డెన్ పరారయ్యాడు. వార్డెన్ కృష్ణ స్వస్థలం భద్రాచలం కావడంతో ఇంటికి తిరిగి వచ్చి ఉండొచ్చని పోలీసులు అక్కడ వెతుకుతున్నారు.
లైంగికదాడి వీడియో తీసి.. పెండ్లి చేసుకోవాలంటూ వేధింపులు..
తన బంధువుపై అత్యాచారం చేసి.. దానికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను పెండ్లి చేసుకోవాలని వేధించడంతో బాధితురాలు నో చెప్పడంతో వీడియోను పోస్టు చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆగస్ట్ 29న ఘజియాబాద్లోని ప్రతాప్ విహార్ ప్రాంతంలో నిందితులు బాధితురాలిని బలవంతంగా రెస్టారెంట్కు తీసుకెళ్లి శారీరకంగా హింసించిన ఘటన జరిగినట్లు సమాచారం. వీడియో కూడా చిత్రీకరించి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నిందితులు బాధితురాలిని కొట్టడం. ఆమెను బెదిరించడం కనిపించింది.
थाना विजय नगर क्षेत्र के प्रकरण में क्षेत्राधिकारी नगर प्रथम की विडियो बाईट:- "प्रकरण में तत्काल थाना विजयनगर पर 1171/22 अभियोग पंजीकृत कर आरोपी को गिरफ्तार कर लिया है। अन्य वैधानिक कार्यवाही अमल में लाई जा रही है।" pic.twitter.com/cUCNGURj2k
— GHAZIABAD POLICE (@ghaziabadpolice)