ఢిల్లీ నుంచి గువాహటి వరకు అమెజాన్ ఎయిర్ తొలి కార్గో విమానాన్ని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవ ప్రారంభంతో ఈశాన్య భారత రాష్ట్రాలకు సరుకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానుంది. ఈ కొత్త కార్గో సేవ ద్వారా ఈ-కామర్స్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.