యూనిఫాం సివిల్ కోడ్,అటవీ సంరక్షణ (సవరణ) చట్టాన్ని వ్య‌తిరేకించిన నాగాలాండ్ అసెంబ్లీ

Published : Sep 12, 2023, 12:50 PM IST
యూనిఫాం సివిల్ కోడ్,అటవీ సంరక్షణ (సవరణ) చట్టాన్ని వ్య‌తిరేకించిన నాగాలాండ్ అసెంబ్లీ

సారాంశం

Kohima: ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ), అటవీ సంరక్షణ (సవరణ) చట్టం అమలును నాగాలాండ్ అసెంబ్లీ సోమవారం వ్యతిరేకించింది. 16 అంశాల ఒప్పందం, ఆర్టికల్ 371 ఏ కింద రక్షణ కోరింది. ఆర్టికల్ 371ఏ ప్రకారం నాగాలకు ప్రత్యేక రక్షణ ఉందనీ, అందువల్ల యూసీసీ, అటవీ సంరక్షణ సవరణ చట్టంపై చర్చించాల్సిన అవసరం ఉందని ఎన్పీఎఫ్ ఎమ్మెల్యే కుజోలుజో నీను అన్నారు.  

Nagaland Assembly opposes Uniform Civil Code: కేంద్ర ప్రతిపాదిత యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ), అటవీ పరిరక్షణ (సవరణ) చట్టం అమలును వ్యతిరేకించిన నాగాలాండ్ అసెంబ్లీ 16 సూత్రాల ఒప్పందం, ఆర్టికల్ 371ఏ ప్రకారం రక్షణ కల్పించాలని కోరింది. నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ, ఎన్సీపీ, ఎన్పీపీ, ఎల్జేపీ (రామ్ విలాస్), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), ఆర్పీఐ (అథవాలే), జేడీయూ, ఇండిపెండెంట్లతో సహా అన్ని పార్టీలు వర్షాకాల సమావేశాల మొదటి రోజు సమస్యలపై చర్చించాయి. ఆర్టికల్ 371ఏ ప్రకారం నాగాలకు ప్రత్యేక రక్షణ ఉందనీ, అందువల్ల యూసీసీ, అటవీ సంరక్షణ సవరణ చట్టంపై చర్చించాల్సిన అవసరం ఉందని ఎన్పీఎఫ్ ఎమ్మెల్యే కుజోలుజో నీను అన్నారు.

"నాగాల మతపరమైన, సామాజిక ఆచారాలు, దాని ఆచార చట్టాలు-ప్రక్రియ, నాగా ఆచార చట్టాల ప్రకారం నిర్ణయాలతో కూడిన సివిల్-క్రిమినల్ న్యాయ పరిపాలన, రాష్ట్ర అసెంబ్లీ అలా నిర్ణయించకపోతే భూమి- దాని వనరుల యాజమాన్యం-బదలాయింపుకు సంబంధించి పార్లమెంటు ఏ చట్టం నాగాలాండ్ రాష్ట్రానికి వర్తించదని ఆర్టికల్ 371 ఎ స్పష్టంగా పేర్కొంది. యూసీసీ, అటవీ చట్టాలను తిరస్కరిస్తూ సభ తీర్మానం చేయాలని" ఆయన ప్రతిపాదించారు. ఈ రెండు అంశాలపై అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి తాము అండగా ఉంటామని నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు చట్టాలు నాగాలాండ్ లో వర్తించవని ఎన్సీపీ శాసనసభాపక్ష ఉపనేత పి.లాంగోన్, ఎన్పీపీ శాసనసభాపక్ష నేత నుక్లుతోషి లాంగ్‌కుమర్ తెలిపారు.

రెండు చర్చల ముగింపు ప్రసంగంలో ముఖ్యమంత్రి నైఫియు రియో మాట్లాడుతూ, రాజకీయ ఒప్పందం-16 పాయింట్ల ఒప్పందం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371 ఏ ను చేర్చడం ద్వారా భారత యూనియన్ లో చేరిన ఏకైక రాష్ట్రం నాగాలాండ్ అని అన్నారు. కేంద్రం తన ఒప్పందాన్ని అవమానించదనీ, నాగాలకు ఇచ్చిన రాజ్యాంగ నిబంధనలను విస్మరించదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూసీసీ నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే 22వ లా కమిషన్ కు వినతిపత్రం సమర్పించిందని రియో సభకు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేబినెట్ సమావేశమైందనీ, పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారని సీఎం తెలిపారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని అధికార ఎన్డీయేకు మిత్రపక్షంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లలేమని రియో అన్నారు. యూసీసీ, అటవీ పరిరక్షణ సవరణ చట్టం పరిధి నుంచి నాగాలాండ్ ను పూర్తిగా మినహాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సభ తీర్మానం చేయవచ్చని సీఎం సూచించారు. ఈ రెండు అంశాలపై వేర్వేరు తీర్మానాలను మంగళవారం పరిశీలనకు తీసుకువస్తామని స్పీకర్ షేరింగ్ లాంగ్ కుమర్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu