Mumbai rains: ముంబ‌యిలో భారీ వ‌ర్షాలు.. రెడ్‌ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ఐఎండీ

Published : Jul 08, 2022, 03:32 PM IST
Mumbai rains: ముంబ‌యిలో భారీ వ‌ర్షాలు.. రెడ్‌ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ఐఎండీ

సారాంశం

Red Alert in Mumbai: దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్ర‌మంలోనే రానున్న 24 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని ఐంఎడీ.. రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.   

India Meteorological Department (IMD): దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో వ‌ర‌ద‌లు పొటెత్తాయి. ఇక మ‌హారాష్ట్రలో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీని కార‌ణంగా వ‌ర‌దలు సంభ‌విస్తున్నాయి. అనేక ప్రాంతాలు ఇప్పటికీ నీట‌మునిగి ఉన్నాయి. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో కూడా ఎడ‌తెరిపిలేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉద‌యం కాస్త ఒరుపు ఇచ్చిన‌ప్ప‌టికీ.. మ‌ధ్యాహ్నం నుంచి వాన కుర‌వ‌డం షురూ అయింది. ఈ క్ర‌మంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి వచ్చే 24 గంటల వరకు ముంబ‌యిలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ కార్యాలయం ప్రజలను వారి ప్రయాణం, ఇత‌ర షెడ్యూల్‌లను అదేవిధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని  కోరింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

శుక్ర‌వారం ఉద‌యం ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న‌ వర్షాల నుండి కొంత ఉపశమనం లభించినప్పటికీ , నగరం, దాని శివారు ప్రాంతాలలో పగటిపూట వివిక్త ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంత‌కుముందు హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ వాన‌లు కుర‌వ‌డం ప్రారంభ‌మైంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో గురువారం నాడు IMD థానే, పాల్ఘర్ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.  కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. అలాగే, వివిక్త ప్రదేశాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచ‌నా వేసింది.   24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదిక‌లు పేర్కొన్నాయి. 

ముంబ‌యి మునిసిపల్ బాడీ భారీ వర్షపాతం హెచ్చరికపై బీచ్‌లను సందర్శించడాన్ని నిషేధించింది.  బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సులు, ముంబ‌యి లైఫ్ లైన్‌గా పరిగణించబడే స్థానిక రైలు సేవలు ఎక్కడా నీటి ఎద్దడి లేనందున సాధారణంగా న‌డిచాయి. అయితే, కొన్ని సబర్బన్ రైళ్లు షెడ్యూల్‌లో కొంచెం ఆల‌స్యంగా న‌డుస్తున్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు. కాగా, సోమవారం నుండి భారీ వర్షం కురుస్తుండ‌టంతో ముంబ‌యిలో.. ట్రాఫిక్ కదలికలను ప్రభావితం చేసే నీటి ఎద్దడి తీవ్రమైన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ వారం ఘట్‌కోపర్, సతారా ప్రాంతాల్లో రెండు కొండచరియలు విరిగిపడిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. అయితే,  ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu
Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu