దెయ్యం పట్టిందని కొడుక్కి చిత్రహింసలు.. ఆపై కొట్టి చంపిన తల్లి, మరో ముగ్గురితో కలిసి దారుణం

By Siva KodatiFirst Published Jun 21, 2021, 11:35 AM IST
Highlights

తమిళనాడులో దారుణం జరిగింది. కొడుకుకి దెయ్యం పట్టిందని కొట్టి చంపింది కన్నతల్లి. తిరువణ్ణామలై జిల్లా అరనిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

తమిళనాడులో దారుణం జరిగింది. కొడుకుకి దెయ్యం పట్టిందని కొట్టి చంపింది కన్నతల్లి. తిరువణ్ణామలై జిల్లా అరనిలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. కన్నమంగళం పోలీసులు చేరుకునేసరికి బాలుడు మృతిచెందాడు. దీంతో చిన్నారి తల్లితో సహా ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. కొడుకుకి దెయ్యం పట్టిందని అందుకే పూజలు చేసే క్రమంలో పిల్లాడు చనిపోయాడని పోలీసులకు తెలిపింది ఆ కసాయి తల్లి. మరోవైపు కన్నతల్లి సపర్యమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని డబ్బుల కోసమే ఇదంతా జరిగి వుంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. 

click me!