
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది ఆగష్టు 11న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారంనాడు ప్రకటించారు.
పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలను సహకరించాలని ప్రహ్లాద్ జోషీ కోరారు.వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి
. ఈ తరుణంలో విపక్షాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అములపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషన్ కేపిటల్ టెరిటరీ(సవరణ) ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది.కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.