Modi US visit 2023: వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ప్రధాని మోడీ.. జో బైడన్‌తో ద్వైపాక్షిక చర్చలు

Published : Jun 22, 2023, 12:38 AM IST
Modi US visit 2023: వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ప్రధాని మోడీ.. జో బైడన్‌తో ద్వైపాక్షిక చర్చలు

సారాంశం

Modi US visit 2023: భార‌త ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు, ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే, యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.  

PM Modi in US: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పీఎం మోడీ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే, యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమానికి నేతృత్వం వహించిన ప్రధాని మోడీ న్యూయార్క్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు.

 

 

న్యూయార్క్‌లో నిర్వహించిన యోగా డే కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని ఆండ్రూ ఎయిర్‌బేస్‌లో వర్షం మధ్య ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. దీంతో పాటు విదేశీ భారతీయులు ఆయనకు సంప్రదాయ స్వాగతం పలికారు. వాషింగ్టన్‌లో పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో ప్రధాని మోడీ సమావేశమవుతారు. 

 

 

గురువారం (జూన్ 22), ప్రధాని మోడీకి వైట్‌హౌస్‌లో గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది. ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉమ్మడి సెషన్‌లో ఇది ఆయన రెండో ప్రసంగం కావ‌డం విశేషం. అంతకుముందు 2016లో అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించారు. గురువారం నాడు, వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్-ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఇచ్చే విందులో ప్రధాని పాల్గొంటారు. 

అంతకుముందు, మంగళవారం యూఎస్ చేరుకున్న తర్వాత, ప్ర‌ధాని మోడీ అనేక మంది అమెరికన్ అనుభవజ్ఞులను కూడా కలిశారు. ట్విట్టర్ అధినేత‌, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్‌తో సహా ఖగోళ భౌతిక శాస్త్రవేత్త-రచయిత నీల్ డిగ్రాస్ టైసన్, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, రచయిత నికోలస్ నాసిమ్ తలేబ్, వ్యాపార‌వేత్త‌లు రే డాలియోలను కూడా కలిశారు. ప్రధానమంత్రి ఫల్గుణి షా, భారతీయ-అమెరికన్ గాయకుడు, స్వరకర్త-గ్రామీ అవార్డు విజేత స‌హా హాలీవుడ్ న‌టుడు రిచ‌ర్డ్ గేరే లు కూడా ఉన్నారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం (జూన్ 23) ప్రధాని మోడీ గౌరవార్థం లంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం నాడు వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ తన రెండు దేశాల పర్యటనలో భాగంగా జూన్ 24 నుంచి 25 వరకు ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial