Raj Thackeray: వాటిని తొల‌గించ‌పోతే.. మ‌సీదు ముందు హనుమాన్ చాలీసా పెట్టాల్సివ‌స్తుంది: రాజ్ థాకరే

Published : Apr 03, 2022, 04:38 AM ISTUpdated : Apr 03, 2022, 04:50 AM IST
Raj Thackeray: వాటిని తొల‌గించ‌పోతే.. మ‌సీదు ముందు హనుమాన్ చాలీసా పెట్టాల్సివ‌స్తుంది: రాజ్ థాకరే

సారాంశం

Raj Thackeray: మజీదులపై మోగుతున్న మైకులపై నవనిర్మాణ సేన (MNS ) చీఫ్ రాజ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదులపై ఏర్పాటు చేసిన‌ మైకులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చ‌ర్య‌ల‌నే ప్ర‌భుత్వ‌మే చేయాల‌ని అన్నారు. లేక‌పోతే.. మ‌సీదుల ముందు హ‌నుమాన్ చాలీసా ప్లే చేస్తానని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాని హెచ్చిరించారు.  

Raj Thackeray:  మజీదులపై మోగుతున్న మైకులపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS ) చీఫ్ రాజ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదులపై ఏర్పాటు చేసిన‌ మైకులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చ‌ర్య‌ల‌నే ప్ర‌భుత్వ‌మే చేయాల‌ని అన్నారు. శివాజీ పార్క్‌లో జరుగుతున్న గుడిపడ్వ మేళాలో కార్యకర్తలను ఉద్దేశించి రాజ్ ఠాక్రే మరోసారి హిందుత్వ అంశాన్ని లేవనెత్తారు. ఈ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. మసీదులలో లౌడ్ స్పీకర్లను ఎక్కువ శబ్దంతో ఎందుకు ప్లే చేస్తారు? అని ప్ర‌శ్నించారు, వాటిని వెంట‌నే ఆపకపోతే.. మసీదుల వెలుపల.. వాటి కంటే  ఎక్కువ శబ్దంతో హనుమాన్ చాలీసాను ప్లే చేస్తామ‌ని  ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు.  

తాను మతోన్మాదిని కాదని, భక్తుడని అన్నారు. నేను ఎవరి ప్రార్థనలను వ్యతిరేకించను. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఉదయం ఐదు గంటల నుంచి ఇబ్బంది. లౌడ్ స్పీకర్ ఏ మతంలో వ్రాయబడింది? మతం ఏర్పడినప్పుడు లౌడ్ స్పీకర్ ఉందా? విదేశాల్లో చూడండి. మీకు ఎక్కడా లౌడ్ స్పీకర్ కనిపించదు. మీరు మీ ప్రభువును ప్రార్థించాలనుకుంటే, ఇంట్లో చేసుకోవాలని రాజ్ థాకరే సూచించారు.

ఇదే స‌మ‌యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను విమ‌ర్శించారు.  ఎన్నికల సమయంలో తాను వ్యతిరేకించిన శక్తులతో జతకట్టడం ద్వారా సిఎం ఓటర్లకు నమ్మకాన్ని ద్రోహం చేశారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)పై కూడా రాజ్ ఠాక్రే దాడి చేశారు. ఎన్సీపీ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కుల విద్వేషాలు వ్యాపిస్తోందని రాజ్ థాకరే ఆరోపించారు.  

ముంబైలో ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనపై కూడా రాజ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. “ముందు వారి పెన్షన్లు నిలిపివేయాలి. తమ పనులతో ప్రజలకు ఏమైనా మేలు చేస్తున్నారా? వారి బంగ్లాలు తీసుకుని, ఆపై వారికి ఇళ్లు ఇవ్వండి. ఈ పథకంలో కూడా ముఖ్యమంత్రికి ఏం లాభం. ఈ పథకంలో ఆసక్తి కలిగించే అంశం ఏదైనా ఉందా’’ అని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Monalisa Missing Mystery: మోనాలిసా మిస్సింగ్.. అసలేం జరిగిందంటే..? | Asianet News Telugu
Summer Trip : వేసవిలో చల్లచల్లగా.. ఇండియాలో తప్పక చూడాల్సిన 10 రిఫ్రెషింగ్ సిటీస్