ఇండో-మయన్మార్ బార్డర్ లో అస్సాం రైఫిల్స్ పై మిలిటెంట్ల కాల్పులు.. ఒక‌రికి గాయాలు

By team teluguFirst Published Aug 9, 2022, 12:38 PM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్ లోని పారా మిలటరీ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఒక జేసీవో కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ సైనికుల‌పై ఉగ్రవాదులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక అధికారికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని రక్షణ ప్రతినిధి ఒకరు ధృవీక‌రించారు. తిరప్ చాంగ్లాంగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక సిబ్బందికి గాయాలైనట్లు తేజ్‌పూర్‌లోని డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ అధికారికి సమాచారం అందించారు.

Bihar political crisis: గవర్నర్‌ను కలవనున్న నితీశ్ కుమార్.. బీజేపీకి షాక్ తప్పదా?.. కాసేపట్లోనే సంచలన ప్రకటన!

“ ఇండో మయన్మార్ సరిహద్దు నుండి మిలిటెంట్ జీపీఎస్ AR tps పై కాల్పులు జరిపిన సంఘటన ఈ రోజు తెల్లవారుజామున జెన్ ఏరియా తిరప్ చాంగ్లాంగ్‌లో జరిగింది. ఓ అధికారి చేతికి చిన్న గాయం అయ్యింది ’’ అని డిఫెన్స్ PRO ట్వీట్ చేశారు.

Incident of firing on Assam Rifles troops by militant groups across the Indo-Myanmar Border during enhanced patrolling activities. pic.twitter.com/u3usvxC3ie

— Resonant News🌍 (@Resonant_News)

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన తాజా ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) చేతికి గాయం కాగా.. నాగాలాండ్‌లోని నోక్లాక్ జిల్లాలో మరో కాల్పుల సంఘటన నమోదైంది. NSCN-KYA సభ్యులు కాల్పుల్లో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 
 

click me!