అమెరికాలో నల్ల జాతీయుడి హత్య.. దానికి చోటు లేదన్న సత్యనాదెళ్ల

Published : Jun 02, 2020, 01:27 PM IST
అమెరికాలో నల్ల జాతీయుడి హత్య.. దానికి చోటు లేదన్న సత్యనాదెళ్ల

సారాంశం

నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.   

ఇటీవల అమెరికాలో ఓ నల్ల జాతీయుడిని అక్కడి పోలీసులు చంపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై అమెరికాలో ఆగ్రజ్వాలలు మిన్నంటుతున్నాయి. నల్ల జాతీయులపై దాడులను ఖండిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై  టెక్‌ దిగ్గజాలు, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.  గూగుల్‌ సీఈవో  సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు.  

 

నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. 

ఇప్పటికే  జార్జ్‌ ప్లాయిడ్‌ మృతిపట్ల  సెర్చ్ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌  సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో  ఉన్న వారెవ్వరూ  ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ  స్క్రీన్ షాట్ ను  ఆయన  ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి  తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?