ఎంబీఏ చదివి....రోడ్డుమీద వడాపావ్ అమ్ముతోంది.. ఎందుకో తెలుసా?

Published : Apr 20, 2023, 10:58 AM ISTUpdated : Apr 20, 2023, 11:08 AM IST
ఎంబీఏ చదివి....రోడ్డుమీద వడాపావ్ అమ్ముతోంది.. ఎందుకో తెలుసా?

సారాంశం

ఆమె పేరు ఫాతిమా కాగా... ఉత్తరప్రదేశ్  కి చెందిన మహిళ గా గుర్తించారు. ఆమె పెళ్లి తర్వాత ఆమె సిలిగురికి వెళ్లింది. ప్రస్తుతం ఆమె జిల్లాలోని మతిగర ప్రాంతంలో నివసిస్తున్నారు. 

మనం నగరాల్లో రోడ్డు మీదకు వెళితే... చాలా రకాల ఫుడ్ స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని  నడిపేవారందరూ దాదాపు చదువు రాక, బతుకు జీవనం కోసం నడిపేవారే ఎక్కువగా ఉంటారు. అయితే... ఈ మధ్యకాలంలో బాగా చదివిన వారు కూడా.. ఈ రకం బండ్లు పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ బీటెక్ చదివిన అమ్మాయి టీ స్టాల్ పెట్టుకుంటే.... తాజాగా.... ఓ ఎంబీయే చదివిన ఓ యువతి  చాట్ బండార్ పెట్టుకుంది.

హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎంబీఏ చేసిన ఓ మహిళ స్కూటర్‌పై ఫుడ్‌స్టాల్‌ను ఏర్పాటు చేసి అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సంఘటన . పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని  సిల్గురిలో 'ఎంబీఏ ఫుడ్ వాలీ' పేరుతో ఓ మహిళ ఈ స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆమె పేరు ఫాతిమా కాగా... ఉత్తరప్రదేశ్  కి చెందిన మహిళ గా గుర్తించారు. ఆమె పెళ్లి తర్వాత ఆమె సిలిగురికి వెళ్లింది. ప్రస్తుతం ఆమె జిల్లాలోని మతిగర ప్రాంతంలో నివసిస్తున్నారు. గత వారం బఘజతిన్ పార్క్ సమీపంలో వ్యాపారం చేయడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.


ఫాతిమా తనకున్న స్కూటర్‌లో ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఆమె స్టాల్ ప్రతిరోజూ రాత్రి 7 నుండి రాత్రి 10:30 వరకు పని చేస్తుంది. ఆమె తన స్టాల్‌లో ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని విక్రయిస్తుంది, ఆమె స్వయంగా వండుతుంది, సంపూర్ణ పరిశుభ్రతను పాటిస్తూ.. వాటిని అమ్మడం విశేషం.

ఫాతిమా ఓ మీడియాతో మాట్లాడుతూ.. "ప్రతి మహిళకు వారి స్వంత గుర్తింపు ఉండాలి. నేను ఉద్యోగం చేసేదానిని, కానీ ఆ తర్వాత నా కుటుంబానికి సమయం దొరకడం లేదు. అందుకే నా కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఉద్యోగం వదిలి ఇప్పుడు నేను ఈ వ్యాపారాన్ని చేస్తున్నాను. నేను 2011లో MBA చేశాను. నా స్టాల్‌లో మీకు ఇంట్లో తయారుచేసిన అన్ని ఆహారాలు లభిస్తాయి. ఇవన్నీ 100 శాతం పరిశుభ్రతను పాటించడం ద్వారా తయారు చేశాను." అని చెప్పడం విశేషం.


ఖీర్, దహీ వడ, గోల్గప్పా , చాట్ వంటి వస్తువులు ఆమె స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రజల డిమాండ్‌ను బట్టి ఫాతిమా తన ఆహార పదార్థాలను మార్చుకుంటుంది. ఈ వస్తువులను ఆమె స్వయంగా వండి విక్రయిస్తుంది. ఒక ప్లేట్ దహీ వడ ధర రూ. 25, గోల్గప్ప చాట్ రూ. 25,  ఖీర్ ధర రూ. 20.

 ‘‘నాకు వంట చేయడంలో నైపుణ్యం ఉంది. నాకు రుచికరమైన ఆహారం ఎలా చేయాలో తెలుసు. అందుకే నేను దీన్ని చేస్తున్నాను.’’ అని ఆమె చెప్పడం విశేషం.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?