పెరుగుతున్న అక్ర‌మ వ‌ల‌స‌లు.. ఎన్నార్సీని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ

Published : Mar 29, 2023, 12:29 PM IST
పెరుగుతున్న అక్ర‌మ వ‌ల‌స‌లు.. ఎన్నార్సీని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ

సారాంశం

Imphal: అక్రమ వలసదారుల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని పేర్కొంటూ ఎన్నార్సీని  డిమాండ్ చేస్తూ మణిపూర్ లో విద్యార్థి, మహిళా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఖ్వైరాంబంద్ కీథేల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బీర్ తికేంద్రజిత్ రియాద్ వెంబడి ఉన్న ముఖ్యమంత్రి బంగ్లా వరకు కొన‌సాగింది. ఎన్నార్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో కూడిన బ్యానర్లను ర్యాలీలో ప్ర‌ద‌ర్శించారు.  

Massive Rally Held In Manipur Demanding NRC: మణిపూర్ లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు విద్యార్థి సంఘాలు, వివిధ మ‌హిళా సంఘాలకు చెందిన వేలాది మంది మహిళలు, విద్యార్థులు, ప్ర‌జ‌లు క‌లిసి ఖ్వైరాంబంద్ కీథేల్ నుండి ముఖ్యమంత్రి సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయాలని వివిధ పౌర సంఘాలు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ డిమాండ్ ను బలపరుస్తూ ఆరు విద్యార్థి సంఘాలు - ఏఎంఎస్ యూ, ఎంఎస్ఎఫ్, కేఎస్ఏ, ఎస్ యూకే, ఏఐఎంలు రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న వ్యాపార కేంద్రమైన ఇంఫాల్ లోని ఖ్వైరాంబంద్ కీథేల్ లో భారీ ర్యాలీ  నిర్వహించాయి. ఖ్వైరాంబంద్ కీథేల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బీర్ తికేంద్రజిత్ రియాద్ వెంబడి ఉన్న ముఖ్యమంత్రి బంగ్లా వరకు కొన‌సాగింది. ఎన్నార్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో కూడిన బ్యానర్లను ర్యాలీలో ప్ర‌ద‌ర్శించారు. అయితే నిరసనకారులను పశ్చిమ కాంగ్లా గేటు వ‌ద్ద మణిపూర్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పటికీ ఆ తర్వాత తిరిగి ఖ్వైరాంబంధ్ కీతెల్ కు చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహించారు.

రాష్ట్రంలోని స్థానిక ప్రజల స‌మ‌స్య‌ల‌ను పెంచుతున్నార‌నీ, అక్రమ వలసదారులను అరికట్టడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళ‌నకారులు పిలుపునిచ్చారు. మాంపూర్ భవిష్యత్తును రక్షించడానికి ఎన్నార్సీని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వీధుల్లోకి వ‌చ్చిన‌ప్పుడు.. కీథేల్ వెండర్ మహిళలు మౌనంగా ఉండలేరని ఖ్వైరాంబంద్ కీథెల్ విక్రేతల నాయకుడు మీడియాతో అన్నారు. బయటి వ్యక్తులు నేడు ఖ్వైరాంబంద్ కీథేల్ మార్కెట్ ను నియంత్రిస్తున్నార‌నీ, ఇద్యార్థులు చేప‌ట్టిన ఈ నిర‌స‌న‌ల‌కు మ‌హిళా సంఘాల, మార్కెట్ సంఘాల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నార్సీని అమలు చేసే వరకు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘం సమన్వయకర్త, సభ్యుడు ఓపెన్ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఆవరణలో, ఇతర అటవీ ప్రాంతాల్లో అక్రమ వలసదారులు స్థిరపడటం ప్రారంభించారని, రాష్ట్రంలోని స్థానిక ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

మార్చి 20న మణిపూర్ కు చెందిన ఏడు విద్యార్థి సంఘాలు, ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్ మణిపూర్ (అన్సామ్), మణిపురి స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్), డెమోక్రటిక్ స్టూడెంట్స్ అలయన్స్ ఆఫ్ మణిపూర్, కాంగ్లీపాక్ స్టూడెంట్స్ అసోసియేషన్ (కేఎస్ఏ), స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ కంగిసిపాక్ (ఎస్ యూకే), అపుంబా ఇరిపాక్కి మహిరోయ్ సింపాంగ్ ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతిపత్రం సమర్పించారు.  మణిపూర్ లో ఎన్నార్సీని అమ‌లు చేయాల‌ని కోరారు.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!