ఐఈడీ పేల్చిన మావోయిస్టులు: 11 మంది సైనికులకు తీవ్రగాయాలు

Siva Kodati |  
Published : May 28, 2019, 09:39 AM ISTUpdated : May 28, 2019, 10:20 AM IST
ఐఈడీ పేల్చిన మావోయిస్టులు: 11 మంది సైనికులకు తీవ్రగాయాలు

సారాంశం

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడికి పాల్పడ్డారు.

జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడికి పాల్పడ్డారు. సరాయ్‌కెల్లాలోని కుచాయి అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కాన్వాయ్‌ వెళ్తుండగా కాపు కాసిన మావోలు ఐఈడీని పేల్చడంతో 11 మంది భద్రతా సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో 8 మంది కోబ్రా జవాన్లు, ముగ్గురు పోలీసులు ఉన్నారు. సైనికులను మరింత మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో రాంచీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్| Asianet News Telugu
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!