భార్య, అత్తను చంపేసి.. బావ మరిదిని తుపాకీతో కాల్చేసి..

By telugu news teamFirst Published Oct 22, 2021, 9:43 AM IST
Highlights

ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారు. ఆయేషా.. తన తల్లి సుమన్(50) ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో.. భార్యపై కోపంతో ఉన్న నీరజ్.. ఆమెను చంపేయాలని అనుకున్నాడు.

ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, ఆమె తల్లిని అతి దారుణంగా చంపేశాడు. స్నేహితుడితో కలిసి అర్థరాత్రి వారి ఇంట్లోకి ప్రవేశించి.. భార్య, ఆమె తల్లిని చంపేశాడు. అనంతరం బావ మరిది, అతని బిజినెస్ పార్ట్ నర్ పై కాల్పులు జరిపాడు. వారిద్దరూ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుడ్ గావ్ కి చెందిన నీరజ్(32) కి కొన్ని సంవత్సరాల క్రితం ఆయేషా(32) తో వివాహం అయ్యింది. అయితే  ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారు. ఆయేషా.. తన తల్లి సుమన్(50) ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో.. భార్యపై కోపంతో ఉన్న నీరజ్.. ఆమెను చంపేయాలని అనుకున్నాడు.

Also Read: మైనర్ తో వివాహిత అక్రమ సంబంధం.. కత్తెరతో పొడిచి, నిప్పంటించి యువతి హత్య..

పథకం ప్రకారం.. తన స్నేహితుడు లేఖరాజ్ తో కలిసి తుపాకీలు తీసుకొని.. గురువారం అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో.. వారి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం భార్య ఆయేషా, అత్త సుమన్ గొంతు కోసేశాడు. అడ్డుగా వచ్చిన బావ మరిది రాజన్(35), అతని బిజినెస్ పార్ట్ నర్ గగన్ పై తుకాపీతో కాల్పుల వర్షం కురిపించారు.

Also Read: హోం వర్క్ చేయలేదని కొట్టి చంపిన టీచర్.. ఆ పిల్లాడు యాక్టింగ్ చేస్తున్నాడని తండ్రికి వివరణ

కాగా.. ఆయేషా, సుమన్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజన్, గగన్ లు తుపాకీ బులెట్ గాయాలతో ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. కాగా... నీరజ్, ఆయేషా దంపతులకు 12 సంవత్సరాల కుమారుడు ఉన్నాడని.. అతనే వారు ఇంట్లోకి రావడానికి తలుపులు తీశాడని తెలుస్తోంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

click me!