బెంగళూరులో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. తల్లి ప్రియుడి ఘాతుకం..

Published : Feb 01, 2023, 10:16 AM ISTUpdated : Feb 01, 2023, 10:17 AM IST
బెంగళూరులో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. తల్లి ప్రియుడి ఘాతుకం..

సారాంశం

తల్లి ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై నిందితుడు అత్యాచారం చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం జరిగింది. 

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో మంగళవారం మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఒక గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఒంటరి మహిళ. నిందితుడితో ఏడాదిగా ఆమె రిలేషన్ షిప్ లో ఉంది. తన కుమార్తెతో కలిసి ఓ ఇంట్లో ఆమె  ఒంటరిగా నివసిస్తుంది.

ఈ ఘటన రాష్ట్ర రాజధాని పశ్చిమ ప్రాంతంలోని కామాక్షిపాళ్య పోలీసు పరిధిలో జరిగింది. తల్లి ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై నిందితుడు అత్యాచారం చేసి హత్య చేసినట్లు సమాచారం. అతన్ని అరెస్టు చేసి, అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

బెంగళూరులో దారుణం.. వీడియో కాల్ లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తితో దాడి..

కామస్క్షిపాళ్యం సమీపంలో ఈ నేరం జరిగింది. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376, 302 మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాలిక కుటుంబానికి పరిచయస్తుడు. ఈ నేరానికి సంబంధించి అతడిని మంగళవారం అరెస్టు చేశారు.

నిందితులు బాలిక తలపై మొద్దుబారిన వస్తువుతో కొట్టి హత్య చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాలిక తలపై బలమైన గాయాలు ఉన్నాయి. బాధితురాలి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం విక్టోరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బాలిక తల్లిదండ్రులు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial