ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం..!

By telugu news teamFirst Published Jul 10, 2021, 7:43 AM IST
Highlights

బాలిక తల్లిదండ్రులు పని చేసేందుకు బయటకు వెళ్లగా, పక్కింటి వ్యక్తి అయిన సర్బ్‌జిత్‌ సింగ్‌ బాలికను దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. తల్లిదండ్రులు లేని సమయంలో.. మైనర్ బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గురువారం బాలిక తల్లిదండ్రులు పని చేసేందుకు బయటకు వెళ్లగా, పక్కింటి వ్యక్తి అయిన సర్బ్‌జిత్‌ సింగ్‌ బాలికను దగ్గర్లోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాడు. తల్లిదండ్రులు వచ్చాక విషయం తెలుసుకొని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

click me!