బాలికను వేధించాడని.. యువకుడి బెడకు బెల్టు బిగించి, కర్రలతో చితకబాది.. దారుణం...

By AN TeluguFirst Published Sep 22, 2021, 11:21 AM IST
Highlights

మధ్యప్రదేశ్, రేవా జిల్లా అర్జున్ పుర్ గ్రామంలో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. యువకుడి మెడకు బెల్టు కట్టి (Belt 
Tied), కర్రలతో తీవ్రంగా కొట్టారు. 

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో దారుణం చోటు చేసుకుంది. బాలికను వేధించాడని.. ఓ యువకుడిని అతి క్రూరంగా హింసించారు. ఈ వీడియో వైరల్(Viral Video)కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఘటనకు కారణమైన ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన వివరాల్లోకి వెడితే... మధ్యప్రదేశ్, రేవా జిల్లా అర్జున్ పుర్ గ్రామంలో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. యువకుడి మెడకు బెల్టు కట్టి (Belt  Tied), కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు బల్దావ్ జాదవ్ (28) దెబ్బలకు తాళలేక గావుకేకలు పెట్టాడు. అయినా వారు వినిపించుకోలేదు. అంతేకాదు ఈ ఘటనను మొత్తం వీడియో కూడా తీశారు. 

స్లీపర్ బస్సులో బాలికపై అత్యాచారం.. అడ్డుకోబోయిన తల్లిని... !

బల్దావ్ జాదవ్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. అతనుగ్రామంలోని ఓ బాలికను వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, ఆగ్రహంలో యువకుడిమీద దాడి చేసినట్లు సమాచారం. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎనిమిది పది రోజుల క్రిందటిదని తెలిపిన పోలీసులు, దాడిచేసిన ముగ్గురిమీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. 

click me!