అనుమానం : మామ, భార్య గొంతుకోసి హత్య.. కూతురితో తప్పుడు పనులు.. !

By AN TeluguFirst Published May 10, 2021, 9:46 AM IST
Highlights

ఓ వ్యక్తి కుటుంబ తగాదాలతో భార్య, మామను హతమార్చిన ఘటన చెన్నైలో జరిగింది. ఆ ఆటో డ్రైవర్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై రాయపేట మహమ్మద్ హుస్సేన్ వీధికి చెందిన ముసాఫర్‌ (80) కుమార్తె కౌవుసి నిషా (50) మొదటి భర్తనుంచి విడాకులు తీసుకుంది. 

ఓ వ్యక్తి కుటుంబ తగాదాలతో భార్య, మామను హతమార్చిన ఘటన చెన్నైలో జరిగింది. ఆ ఆటో డ్రైవర్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై రాయపేట మహమ్మద్ హుస్సేన్ వీధికి చెందిన ముసాఫర్‌ (80) కుమార్తె కౌవుసి నిషా (50) మొదటి భర్తనుంచి విడాకులు తీసుకుంది. 

ఆ తరువాత రాయపేట యానైకుళానికి చెందిన ఆటోడ్రైవర్ అబ్దుల్ ఖాదర్ ల(42)ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ద్వారా జన్మించిన కుమార్తె(21)తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. కౌన్సిల్ నిషా తన కుమార్తెను తప్పుడు మార్గంలో నడుపుతున్నట్టు అబ్దుల్ ఖాదర్ అనుమానించాడు.

ఈ విషయమై దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో నిషా రాయపేటలోని తండ్రి ముసాఫర్ ఇంటికి చేరుకుంది. ఇది తెలిసిన అబ్దుల్ ఖాదర్ అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. గొడవ పెరిగి బీరు బాటిల్ తో  ముసాఫర్ పై దాడి చేశాడు. కత్తితో భార్య గొంతు కోశాడు. దీంతో మామ, భార్య ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

చుట్టుపక్కల వారితో విషయం తెలిసిన జామ్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ ఖాదర్ ను అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు టీ నగర్ లో భర్య మృతిని తట్టుకోలేక భర్త మృతి చెందాడు. ఈ సంఘటన శివగంగై జిల్లాలో చోటుచేసుకుంది. దేవకోట్టై దండాయుధపాణి ఆలయం వీధిలో స్వామినాథన్(90), సుందరాంబాళ్‌ (88) దంపతులూ ఉంటున్నారు.

 వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులకు వివాహం కావడంతో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సుందరాంబాళ్‌ అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ విషాదాన్ని తట్టుకోలేక భర్త స్వామినాథన్ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. భార్య భర్తలు ఒకే రోజున చనిపోవడం విషాదాన్ని నింపింది.

click me!