అనితకు పెళ్లికి ముందే అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉండగా, వివాహమైన తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
తమిళనాడు : తన భార్యను కాపురానికి పంపించేందుకు నిరాకరించిన అత్తను ఓ వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన పక్కింటి వ్యక్తిపై కూడా అతను దాడి చేసి గాయపరిచాడు. తిరునెల్వేలి జిల్లా నాంగునేరిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,... జిల్లాలోని నాంగునేరి సమీపంలోని మూలక్కరైపట్టి గ్రామంలో వేలాయుధం, రాజలక్ష్మి (45) అనే దంపతులున్నారు.
రాజలక్ష్మి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ దంపతులకు అనిత (23) అనే కుమార్తె ఉండగా, ఈమెను అభిమన్యు (33) అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, అనితకు పెళ్లికి ముందే అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉండగా, వివాహమైన తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
ఈ విషయం తెలిసిన భర్త అభిమన్యుడు భార్యను పలుసార్లు మందలించాడు. ఏదైనా సరే కానీ, ఆమె ప్రవర్తనను మార్చుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆ పిల్లలను వదిలి పెట్టి పిల్లలను వదిలి పెట్టి పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత అభిమన్యు భార్య కోసం అత్తగారింటికి వచ్చాడు. తన భార్యను కాపురానికి పంపించాలని అత్తను కోరాడు.
భర్తను చంపేందుకు.. ప్రియుడికి రూ.15లక్షల సుపారీ..!
అయితే ఆమె ఆగ్రహించి అల్లుడిని తిట్టి దాడికి యత్నించింది. దీంతో అభిమన్యు ఇంటికి వెళ్లిపోయి మరో రెండు రోజుల తర్వాత మళ్ళీ భార్య కోసం వచ్చాడు. అప్పుడు కూడా అల్లుడిపై రాజలక్ష్మి గొడవకు దిగింది. దీంతో ఆగ్రహించిన అభిమన్యు తన వద్ద ఉన్న కత్తితో కిరాతకంగా దాడి చేశాడు.
దీనికి ఆమె భర్త కూడా ప్రోత్సహించాడని సమాచారం. కాగా రాజలక్ష్మిపై జరిగిన దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కూడా అభిమన్యు దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్యలక్ష్మి మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.