
వేలూరు : ప్రియురాలిని హత్య చేసి ప్రియుడు suicide చేసుకున్న ఘటన వేలూరులో చోటుచేసుకుంది వివరాలు.. వేలూరు వల్లలార్ ప్రాంతానికి చెందిన భారతిదాసన్, దీపలక్ష్మి దంపతుల కుమార్తె సాధన (16) చదువుతోంది. ఏలూరు సమీపంలోని కరుగంబత్తూరు మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన రామ్కుమార్ (22) కార్మికుడు. శనివారం రాత్రి సాధన ఇంట్లో సాధన మృతి చెంది ఉండగా.. రామ్ కుమార్ ఉరి వేసుకుని suicide చేసుకుని ఉండటాన్ని భారతిదాసన్, దీపలక్ష్మి గుర్తించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి parents కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సాధనను.. రామ్ కుమార్ గొంతునులిమి murder చేసి, ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. రామ్ కుమార్, సాధన ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఖండించారు. దీంతో సాధన, రామ్ కుమార్ తో మాట్లాడటం మానేసింది. ఆగ్రహించిన రామ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో extramarital affairకి అడ్డు వస్తుందని.. కన్నకూతురినే కడతేర్చింది. కనిపెంచిన పేగు బంధాన్ని కామవాంఛతో కాలరాసింది. కన్న బిడ్డను కర్కశంగా murder చేసి ..బావిలో పడేసి... ఎటో వెళ్ళిపోయింది అని అందరిని నమ్మించింది. ఈ దారుణం Badvel మండలం లక్ష్మీ పాలెంలో చోటుచేసుకుంది. రామచంద్ర ఎస్ఐ వెంకటరమణ, సిబ్బంది సహకారంతో హత్య కేసు mystreryని ఛేదించారు. ఆదివారం బద్వేలు పోలీసు సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు…
లక్ష్మీ పాలెం గ్రామానికి చెందిన రమణమ్మ సమీప బంధువు శీనయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరు ఏకాంతంగా ఉండటం కుమార్తె వెంకట సుజాత కంటపడింది. తల్లి ప్రవర్తనపై ఆగ్రహించి పద్ధతి మార్చుకోమని హెచ్చరించింది. అప్పటినుంచి కొన్నాళ్ళు దూరంగా ఉన్న రమణమ్మ, శీనయ్య ఆ తర్వాత వెంకటసుజాత తమ ఏకాంతానికి అడ్డుగా నిలుస్తుందని.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. నిరుడు అక్టోబర్ 16న వెంకట సుజాత (17) ఇంట్లో భోజనం చేసి నిద్రిస్తుండగా.. అదే అదనుగా భావించిన తల్లి పథకం ప్రకారం విషయాన్ని శీనయ్యకు చేరవేసింది.
శీనయ్య మరో వ్యక్తి కొండయ్యతో కలిసి రమణమ్మ ఇంటికి వచ్చాడు. మంచంపై పడుకొని ఉన్న వెంకటసుజాత మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని ఆటోలో ఊరి చివర ఉన్న ఒక బావిలో పడవేశారు. హత్య జరిగిన తరువాత రమణమ్మ తన కుమార్తె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని... అమాయకంగా ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. ఏమీ తెలియనట్టు సమీప ప్రాంతాల్లో వెతికించింది. భర్త వెంకటయ్య మద్యానికి బానిస కావడంతో ఇవేమీ పట్టించుకోలేదు.
ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివి కుటుంబ సహకారం లేక వెంకట సుజాత చదువు ఆపేసింది. ఆమె మానసిక స్థితి బాగా లేదని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తల్లి అందరికీ చెప్పింది. రెండు రోజుల తర్వాత మృతదేహం బావిలో కనిపించడంతో... స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా సీఐ రామచంద్ర, ఎస్సై వెంకటరమణ ముమ్మర దర్యాప్తు చేశారు.
తల్లి రమణమ్మ తీరు అనుమానాస్పదంగా ఉండటం... పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో శీనయ్య, కొండయ్యలతో కలిసి తానే కూతురిని హత్య చేసి బావిలో పడేసినట్లు ఒప్పుకోంది. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.