దారుణం : వాట్సప్ స్టేటస్ ప్రాణాలు తీసింది.. !

By AN TeluguFirst Published Jan 18, 2021, 9:15 AM IST
Highlights

వాట్సప్ స్టేటస్ ఓ హత్యకు దారి తీసిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది.  ఫొటోల వ్యవహారం ఓ దళిత యువకుడి హత్యకు దారితీసింది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురలో ఆదివారం కలకలం రేపింది. 

వాట్సప్ స్టేటస్ ఓ హత్యకు దారి తీసిన దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది.  ఫొటోల వ్యవహారం ఓ దళిత యువకుడి హత్యకు దారితీసింది. వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురలో ఆదివారం కలకలం రేపింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రహళ్లికి చెందిన అభి ప్రవీణ, మనోజ్‌ అనే యువకుల ఫొటోలను అదే ప్రాంతానికి చెందిన శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు శీనా ఇంటికి వెళ్లి చాకుతో పొడిచి ఉడాయించారు. 

తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా హతుడు దళిత సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజగోపాల్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

click me!