మెట్రో లిఫ్ట్‌లో ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..తాకుతూ మహిళకు లైంగిక వేధింపులు, వ్యక్తి అరెస్ట్..

Published : Apr 15, 2023, 01:33 PM IST
మెట్రో లిఫ్ట్‌లో ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..తాకుతూ మహిళకు లైంగిక వేధింపులు, వ్యక్తి అరెస్ట్..

సారాంశం

మెట్రో రైలు లిఫ్ట్ లో ఓ వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్ట్స్ ను చూపిస్తూ ఆమెను వేధించాడు. 

న్యూఢిల్లీ : ఏప్రిల్ 4న ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో మహిళను లైంగికంగా వేధించిన 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న నిందితుడు రాజేష్ కుమార్, దక్షిణ ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌లో తన ప్రైవేట్ భాగాలను బయటపెట్టి, వాటితో తాకుతూ ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 

ఈ మేరకు ఆరోపణలు రావడంతో సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ, లోకల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రాజేష్‌ని పట్టుకున్నారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన మహిళ అతని చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజేష్ మెట్రో రైలు ఎక్కకుండానే పారిపోయాడు. ఢిల్లీ మెట్రో పోలీసులు వేధింపులకు సంబంధించిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం.. బీహార్ లో ఘటన

ఇదిలా ఉండగా, యూపీలోని పిలిభిత్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ 15 ఏళ్ల బాలికను.. 18 ఏళ్ల స్కూల్‌మేట్ వేధించాడు. ఆ తరువాత కొడుకును ఇంట్లో నుండి బయటకు పంపి బాలుడి తండ్రి (42) బాలిక మీద అత్యాచారం చేశాడు. మార్చి 13న ఈ దారుణమైన ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. దీనిమీద పిలిభిత్ లోని పోక్సో చట్టం ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. 18యేళ్ల బాలుడు.. రాబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ తన దగ్గర ఉందని.. దాని ఫొటోకాపీ ఇస్తానని ఆ బాలికను మభ్యపెట్టాడు. అలా మార్చి 13న, బాలుడు 9వ తరగతి బాలికను పాఠశాల నుండి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తరువాత ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. 

ఆ కేకలు విన్న బాలుడి తండ్రి బాలుడి గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకును కోప్పడి బయటికి పంపించేశాడు. ఆ తరువాత ఆ చిన్నారికి రక్షణ కల్పించాల్సింది పోయి.. కొడుకు చేసిన పనిని పొడిగించాడు. అరవకుండా ఆమె నోటిని స్కార్ఫ్ తో కట్టేసి, ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక వేధింపుల గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబానికి తెలిపింది. 

దీంతో 14వతేదీ బాధితురాలి అత్త ఈ ఘటన మీద పీఎస్ లో కేసుపెట్టింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడి తండ్రి బెదిరించాడని బాధితురాలి అత్త తన ఫిర్యాదులో పేర్కొంది.బాలిక అత్త మొదట మార్చి 14న లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె ఫిర్యాదుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో, మార్చి 17న పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శర్మకు లేఖ రాసింది.

పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అత్త ఆదివారం తెలిపింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎస్ హెచ్ఓ నరేష్ త్యాగి మాట్లాడుతూ, "ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 341 (ఒక వ్యక్తిని తప్పుగా నిరోధించడం), 376 (అత్యాచారం), 354 (ఆమె నమ్రతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో ఒక మహిళపై క్రిమినల్ ఫోర్స్ ప్రయోగించడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) లాంటి పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. వారిని త్వరలో అరెస్టు చేస్తాం" అని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌