'నన్ను క్షమించండి': రాష్ట్రపతి ముర్ముకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు

Published : Nov 14, 2022, 06:57 PM IST
'నన్ను క్షమించండి': రాష్ట్రపతి ముర్ముకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు

సారాంశం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని బెంగాల్‌ సీఎం, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. తన మంత్రి అఖిల్‌గిరి తప్పు చేసిందనీ, తన తరుపున క్షమాపణ కోరుతున్నాననీ ఐయామ్‌ సారీ’ అని అన్నారు. 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదన్నారు. సోమవారం నాడు నబన్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మమత బెనర్జీ మాట్లాడుతూ..‘రాష్ట్రపతి చాలా మంచి నాయకురాలు. ఎమ్మెల్యే అఖిల్‌గిరి చేసింది తప్పే. తన తరుపున నేను క్షమాపణ కోరుతున్నా.  ఐయామ్‌ సారీ’ అని అన్నారు. ఈ వివాదంపై తన పార్టీ క్షమాపణలు కూడా చెప్పిందని అన్నారు. 

మంత్రి అఖిల్ గిరి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాననీ,  బాహ్య రూపాన్ని బట్టి అందాన్ని నిర్ణయించలేమనీ, నిజమైన అందం  అంతర్గతమైందనీ, తనకు వ్యక్తిగతంగా అధ్యక్షుడు ముర్ము అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆమె అంటే నాకు చాలా గౌరవం.  క్షమించండి, పార్టీ తరపున క్షమాపణలు కోరుతున్నానని బెనర్జీ అన్నారు. ఎవరు తప్పు చేసిన తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందనీ, తన పార్టీ వారైన వారికి తమ మద్దతు ఇవ్వడం లేదనీ అన్నారు.  మాట్లాడటం ఒక కళ అనీ, తాను కొన్నిసార్లు 'కింభుత్కిమకర్' (ఇంగ్లీష్‌లో వింత అని అర్థం) అనే పదాన్ని ఉపయోగిస్తాననీ, డిక్షనరీలో అలాంటి పదాలకు అర్థాలు వేరుగా ఉంటాయని అన్నారు.


ఈస్ట్‌ మిడ్నాపూర్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే అఖిల్‌గిరి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో బెంగాల్‌ బీజేఎల్పీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేస్తూ అఖిల్‌గిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సువేందు అధికారిని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. మనుషుల రూపు చూసి జడ్జి చేయమనీ. రాష్ట్రపతి కుర్చీని గౌరవిస్తాం. కానీ, రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంది..? అని వ్యాఖ్యానించారు.

 అధ్యక్షుడు ముర్ము తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గిరి ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. తన వ్యాఖ్యల వీడియో క్లిప్ వైరల్ కావడంతో, గిరి దానికి క్షమాపణలు చెప్పాడు. మంత్రి గిరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ వరుసగా మూడో రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు ప్రదర్శనలు చేసింది. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. మంత్రికి వ్యతిరేకంగా టైర్లు తగులబెట్టి, నినాదాలు చేస్తూ, బిజెపి మద్దతుదారులు ఆదివారం పుర్బా మేదినీపూర్ జిల్లా కంతి పట్టణంలోని గిరి నివాసం సమీపంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

మరోవైపు.. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లారు. బీజేపీ శాసనసభ్యులకు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నాయకత్వం వహించారు. రాష్ట్రపతిపై రాష్ట్ర మంత్రి అఖిల గిరి చేసిన వ్యాఖ్యపై పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరో తప్పు చేశారన్నారు. ఈ వ్యాఖలను తాము వ్యతిరేకిస్తున్నామనీ, వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వారిని సమర్ధించడం సరికాదని అన్నారు. రోజుకో ప్రకటనలు చేస్తూ మాట్లాడుతూ.. అబద్ధాలు ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. 

రాష్ట్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ్ బర్ధమాన్, మాల్దా, బంకురా జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రపతిపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిని మంత్రిగా తొలగించాలని, ఆమెను అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.కోల్‌కతాతో సహా అనేక ఇతర ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించింది బీజేపీ.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రపతిపై అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు.  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గిరిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా అవమానించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించి ఆమెపై చర్యలు తీసుకోవాలని బెంగాల్ సీఎంని కోరారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu