ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, రంగంలోకి 26 ఫైరింజన్లు

Siva Kodati |  
Published : Jan 14, 2020, 12:52 PM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, రంగంలోకి 26 ఫైరింజన్లు

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారెన్స్ రోడ్డులో ఉన్న ఓ చెప్పుల తయారీ యూనిట్‌లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారెన్స్ రోడ్డులో ఉన్న ఓ చెప్పుల తయారీ యూనిట్‌లో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

Also Read:న్యూఢిల్లీలో అగ్నిప్రమాదం: కూలిన భవనం, శిథిలాల కింద పలువురు

26 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరిగినట్లు సమాచారం అందలేదు. ఘటన సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు.

Also Read:ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. దగ్ధమవుతున్న రెండు పరిశ్రమలు

కాగా గత నెల ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 8న ఆనాజ్‌మండీ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్ తయారు చేసే ఆ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హీటర్లు వేసుకుని నిద్రపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ధ్రువీకరించారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్