ఎగ్జిట్ పోల్స్ : మహారాష్ట్రలో బిజెపి హవా.. ఇండియా టుడే సర్వే!

By Siva KodatiFirst Published May 19, 2019, 7:19 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో ఫలితం ఎలా ఉండబోతోందో తన సర్వే ద్వారా వివరించింది. 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ మహారాష్ట్రలో ఫలితం ఎలా ఉండబోతోందో తన సర్వే ద్వారా వివరించింది.  మహారాష్ట్రలో బిజెపి కూటమి తిరుగులేనివిధంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇండియా టుడే సర్వే ప్రకారం వివిధ పార్టీలు గెలుచుకునే పార్లమెంట్ స్థానాలు ఇలా ఉన్నాయి. 

మహారాష్ట్ర (48)

బిజెపి కూటమి : 38-42

కాంగ్రెస్ కూటమి : 6-10

దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి  

click me!