‘ప్రధాని పెంచాల్సింది అది కాదు’.. మోదీకి రూ.100 పంపిన టీ స్టాల్ వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే...

By AN TeluguFirst Published Jun 9, 2021, 4:58 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీకి  గెడ్డం గీసుకోమని సూచిస్తూ వంద రూపాయలు పంపాడు మహారాష్ట్రలోని బారామతికి చెందిన ఓ టీ అమ్ముకునే వ్యక్తి. దాంతో పాటు ఓ లేఖను కూడా జత చేశాడు. కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలలుగా దేశంలోని అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బారామతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే ప్రధానికి తన అసంతృప్తి గళాన్ని ఈ విధంగా వినిపించాడు. 

ప్రధాని నరేంద్ర మోదీకి  గెడ్డం గీసుకోమని సూచిస్తూ వంద రూపాయలు పంపాడు మహారాష్ట్రలోని బారామతికి చెందిన ఓ టీ అమ్ముకునే వ్యక్తి. దాంతో పాటు ఓ లేఖను కూడా జత చేశాడు. కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలలుగా దేశంలోని అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బారామతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే ప్రధానికి తన అసంతృప్తి గళాన్ని ఈ విధంగా వినిపించాడు. 


‘పీఎం నరేంద్రమోడీ గడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకమీదట ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయించడానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి.

చివరి రెండు లాక్ డౌన్ ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే దృష్టి సారించాలని’ ఆ లేఖలో ప్రధానికి మోరే సూచించాడు. 

‘నాకు మన దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం, నేను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు రూ. 100 పంపుతున్నాను. దానితో ఆయన గెడ్డం గీయించుకోవాలి. ఆయన ఈ దేశ అత్యున్నత నాయకుడు. ఆయనను అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. మహమ్మారి కారణంగా రోజురోజుకూ ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులు ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా.. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఈ మార్గం ఎంచుకున్నా’ అని మోరే తెలిపారు. 
 

click me!