
Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్ గడ్డపై గత జనవరి 13 నుంచి జరుగుతున్న సాంస్కృతిక సంగమం మహా కుంభమేళా శనివారం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ పవిత్ర కార్యక్రమం ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది... ఇందులో ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసి మతపరమైన, సాంస్కృతిక ఐక్యతకు ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచారు.
ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో మొత్తం 120 కోట్ల మంది సనాతన ధర్మం అంటే హిందు ధర్మం పాటించేవారు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే మహా కుంభమేళాలో ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ మంది హిందువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసి పుణ్యఫలాలు పొందారు. ఫిబ్రవరి 26న శివరాత్రి చివరి స్నాన పర్వం నాటికి ఈ సంఖ్య 65 కోట్లకు పైగా చేరవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన చక్కటి ప్రయత్నాల వల్ల సాధ్యమైంది. భారతదేశపు ఈ పురాతన సంప్రదాయం తన దివ్యత్వం, గొప్పతనంతో ప్రపంచాన్నే మంత్రముగ్ధుల్ని చేసింది.
మహాకుంభమేళాలో 73 దేశాల రాయబారులు, భూటాన్ రాజు నామ్గ్యాల్ వాంగ్చుక్తో సహా అనేక దేశాల అతిథులు వచ్చి అమృత స్నానం చేసారు. అంతేకాదు సీతాదేవి పుట్టినిల్లు అయిన నేపాల్ నుంచి 50 లక్షల మందికి పైగా ప్రజలు ఇప్పటివరకు త్రివేణి పవిత్ర జలాల్లో స్నానం చేసి మహాకుంభ్కు సాక్షులుగా నిలిచారు.
భారతదేశం ఒక మతపరమైన దేశం. ఇక్కడ ఒకటి కాదు, అనేక మతాలను విశ్వసించే ప్రజలు కలిసి జీవిస్తున్నారు. అయితే ఇందులో సనాతన ధర్మాన్ని నమ్మే వారి సంఖ్యే ఎక్కువ. వరల్డ్ పాపులేషన్ రివ్యూ, ప్యూ రీసెర్చ్ ప్రకారం భారతదేశ జనాభా సుమారు 143 కోట్లు (1.43 బిలియన్లు). ఇందులో సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య దాదాపు 110 కోట్లు (1.10 బిలియన్లు). అలాగే ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య 120 కోట్లు. ఈ విధంగా స్నానాలు చేసిన వారి సంఖ్యను ప్రపంచంలోని సనాతనుల సంఖ్యతో పోల్చి చూస్తే 50 శాతానికి పైగా ప్రజలు ఇప్పటివరకు త్రివేణి సంగమంలో స్నానం చేశారు.
దేశంలోని మొత్తం జనాభాతో స్నానాలు చేసిన వారిని పోల్చి చూస్తే ఇది 55 శాతం అవుతుంది. అంటే దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 55 శాతానికి పైగా ప్రజలు త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ప్యూ రీసెర్చ్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల (1.2 బిలియన్లు) జనాభా సనాతన ధర్మాన్ని నమ్ముతోంది.
గంగా, యమునా, సరస్వతీ నదుల పవిత్ర సంగమంలో శ్రద్ధాభక్తులతో సాధువులు, సన్యాసులు, భక్తులు, గృహస్థులు స్నానం చేయడం సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభ్ ప్రారంభానికి ముందు ఊహించిన దానికంటే ఎక్కువే జరిగింది. ఈసారి జరిగే మహాకుంభ్ స్నానానికి వచ్చే భక్తుల సంఖ్యలో కొత్త రికార్డు సృష్టిస్తుందని సీఎం యోగి ముందే అంచనా వేశారు. మొదట్లో 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఆయన అంచనా ఫిబ్రవరి 11నే నిజమైంది. శనివారం (ఫిబ్రవరి 22) నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటిపోయింది. ఇంకా మహాకుంభ్ ముగియడానికి 05 రోజులు ఉంది. ముఖ్యమైన మహాశివరాత్రి స్నాన పర్వం మిగిలి ఉంది. స్నానానికి వచ్చే భక్తుల సంఖ్య 65 కోట్లకు పైగా వెళ్తుందని గట్టిగా నమ్మవచ్చు.
ఇప్పటివరకు స్నానాలు చేసిన వారి సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి 1, జనవరి 30 తేదీల్లో 2-2 కోట్లకు పైగా, పౌష పౌర్ణమి రోజున 1.7 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అంతేకాకుండా వసంత పంచమి రోజున 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణిలో భక్తితో పుణ్యస్నానాలు చేశారు. మాఘి పౌర్ణమి ముఖ్యమైన స్నాన పర్వం రోజున కూడా రెండు కోట్ల మందికి పైగా భక్తులు సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు.