సీబీఐ చేతికి తంజావూరు విద్యార్థి ఆత్మహత్యకేసు

Published : Jan 31, 2022, 04:04 PM IST
సీబీఐ చేతికి  తంజావూరు విద్యార్థి ఆత్మహత్యకేసు

సారాంశం

 అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.


తంజావూరు విద్యార్థి ఆత్మహత్య కేసు విషయంలో మద్రాస్  హైకోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ  కేసును.. సీబీఐ చేతికి అప్పగించింది. విద్యార్థిని చదువుతున్న పాఠశాలలో బలవంతంగా మతమార్పిడికి యత్నించడం వల్లే ఆ ఒత్తిడికి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.

ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. సేక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. ఆ విద్యార్థిని జనవరి 15న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు.. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆమె మృతిచెందినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసునే ఇప్పుడు సీబీఐ కి అప్పగించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌