అత్తారింటికి వెళుతూ... చెరువులో దూకిన నవ వధువు

Published : Jun 15, 2020, 10:54 AM IST
అత్తారింటికి వెళుతూ... చెరువులో దూకిన నవ వధువు

సారాంశం

ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్‌, షియోపూర్‌ చంబల్‌ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్‌ ఇందుకు ఒప్పుకోలేదు.

ఆమె మెడలో తాళి పడి కొద్ది గంటలు కూడా కావడం లేదు. బంధువుల ఆనందోత్సాహల మధ్య పెళ్లి జరిగిన కాసేపటికే వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అత్తారింటికి వెళుతుండగా.. చెరువులో దూకేసింది.  ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్తాన్‌ అలపుర్‌కు చెందిన ఓ యువతికి శనివారం రాత్రి పెళ్లైంది. ఆ తర్వాత రోజు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపే వేడుక జరిగింది. అనంతరం భర్త, అత్తామామలతో కలిసి ఆమె మధ్యప్రదేశ్‌ షియోపూర్‌లోని అత్తారింటికి కారులో బయలు దేరింది.

 ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్‌, షియోపూర్‌ చంబల్‌ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్‌ ఇందుకు ఒప్పుకోలేదు.

దీంతో ఆమె స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్‌ బ్రేకులు వేశాడు. పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే.. వధువు కారు నుంచి బయటకు దిగి నదిలో దూకేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వధువు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఇప్పటివరకూ గల్లంతు అయిన వధువు ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ సంఘటనపై వధువు తండ్రి మాట్లాడుతూ.. ‘‘ శనివారం రాత్రి పెళ్లి జరిగినప్పుడు కూడా తను బాగానే ఉంది. ఇంతలో ఏమైందో అర్థం కావటం లేదు’’ అంటూ వాపోయారు.

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo