బోరుబావిలో ప‌డిన‌ చిన్నారి కథ విషాదాంతం..

Published : Jun 09, 2023, 02:03 AM IST
బోరుబావిలో ప‌డిన‌ చిన్నారి కథ విషాదాంతం..

సారాంశం

Sehore: మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతైన బోరుబావిలో ప‌డిపోయిన మూడేళ్ల చిన్నారి గురువారం మృతి చెందింది. ముంగోలి గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన భారీ సహాయక చర్యల అనంతరం బాలిక‌ను బ‌య‌ట‌కు తీశారు. 'సాయంత్రం 6 గంటల సమయంలో బాలికను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను బతికించడానికి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారిని కాపాడలేకపోవడం దురదృష్టకరం.. వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది' అని జిల్లా కలెక్టర్ ఆశిష్ తివారీ తెలిపారు.  

Madhya Pradesh borewell: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిపోయిన చిన్నారి కథ విషాదాంతమైంది. దాదాపు 50 గంట‌ల‌కు పైగా శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. చిన్నారిని వెలికితీసి ఆస్పత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతైన బోరుబావిలో ప‌డిపోయిన మూడేళ్ల చిన్నారి గురువారం మృతి చెందింది. ముంగోలి గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన భారీ సహాయక చర్యల అనంతరం బాలిక‌ను బ‌య‌ట‌కు తీశారు. 'సాయంత్రం 6 గంటల సమయంలో బాలికను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమెను బతికించడానికి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారిని కాపాడలేకపోవడం దురదృష్టకరమ‌నీ,  వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది' అని జిల్లా కలెక్టర్ ఆశిష్ తివారీ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల బాలికను 100 అడుగుల లోతు నుంచి రక్షించారు. అయితే, ఆ బాలిక అప్ప‌టికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 50 గంటలకు పైగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఈఆర్ఎఫ్, ఎర్త్ మూవర్స్ సిబ్బందితో కలిసి రోబోటిక్ బృందం పాల్గొంది. మంగళవారం వేకువజామున ఒంటిగంట సమయంలో 300 అడుగుల బోరుబావిలో పడి 1 అడుగుల నుంచి 100 అడుగుల లోతుకు జారిపడిన బాలికను గురువారం సాయంత్రం 40.5 గంటలకు రక్షించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

ఆర్మీ సహా పలు ఏజెన్సీలకు చెందిన సిబ్బంది బాలికను కాపాడేందుకు రంగంలోకి దిగాయి. పైపు ద్వారా ఆమెకు ఆక్సిజన్ సరఫరా చేయడం, ఆ ప్రాంతంలో ఉదయం నుంచి వర్షం, ఈదురుగాలుల సవాలును రెస్క్యూ సిబ్బంది ఎదుర్కొన్నారు. గుజరాత్ కు చెందిన రోబోటిక్ నిపుణుల బృందం ఉదయం ఆపరేషన్ లో పాల్గొని బాలికను కాపాడిందని అధికారులు తెలిపారు. అయితే, చిన్నారి పరిస్థితిపై సమాచారం సేకరించేందుకు రోబోను బోరుబావిలోకి దించామనీ, సహాయక చర్యల్లో తదుపరి కార్యాచరణకు సంబంధించి డేటాను ఉపయోగించిన‌ట్టు రోబోటిక్ టీం ఇన్ఛార్జ్ మహేష్ ఆర్య సంఘటనా స్థలంలో మీడియాకు తెలిపారు. తొలుత చిన్నారి 40 అడుగుల లోతులో చిక్కుకున్నప్పటికీ సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాల వల్ల ఏర్పడిన ప్రకంపనల కారణంగా 100 అడుగుల లోతుకు పడిపోయిందని మధ్యప్రదేశ్ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. చిన్నారిని కాపాడ‌టానికి అన్ని చ‌ర్య‌లు తీసుకున్న ఫలితం లేకుండాపోయింద‌ని జిల్లా యంత్రాంగం విచారం వ్య‌క్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu