ఎన్నికలకు ముందు బీజేపీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన 8 జిల్లాల నాయ‌కులు

Published : Sep 02, 2023, 10:47 PM IST
ఎన్నికలకు ముందు బీజేపీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన 8 జిల్లాల నాయ‌కులు

సారాంశం

Dhar District: మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. బీజేపీకి చెందిన ఒక‌ ఎమ్మెల్యే సహా 8 జిల్లాలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరారు. ధార్ జిల్లాకు చెందిన కోలారస్ ఎమ్మెల్యే బీరేంద్ర, బీజేపీ ఎమ్మెల్యే భవర్ సింగ్ షెకావత్, సాగర్ జిల్లాకు చెందిన చంద్ర భూషణ్ సింగ్ బుందేలా (గుడ్డు రాజా) లు కూడా కాంగ్రెస్ లో చేరిన నేత‌ల్లో ఉన్నారు.  

Madhya Pradesh Congress: మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. బీజేపీకి చెందిన ఒక‌ ఎమ్మెల్యే సహా 8 జిల్లాలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో  చేరారు. ధార్ జిల్లాకు చెందిన కోలారస్ ఎమ్మెల్యే బీరేంద్ర, బీజేపీ ఎమ్మెల్యే భవర్ సింగ్ షెకావత్, సాగర్ జిల్లాకు చెందిన చంద్ర భూషణ్ సింగ్ బుందేలా (గుడ్డు రాజా) లు కూడా కాంగ్రెస్ లో చేరిన నేత‌ల్లో ఉన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సహా ఎనిమిది జిల్లాలకు చెందిన పలువురు నేతలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భోపాల్ లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో వారికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీలో చేరిన 10 మంది నేతల్లో ఒకరు శివపురి జిల్లాలోని కోలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరేంద్ర రఘువంశీ ఆగస్టు 31న బీజేపీని వీడారు. రెండు పేజీల రాజీనామా లేఖలో బీజేపీ అవినీతి, కుమ్ములాటలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు.

కాంగ్రెస్ లో చేరిన ఇత‌ర నేత‌ల్లో ధార్ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే భవర్ సింగ్ షెకావత్, సాగర్ జిల్లాకు చెందిన చంద్ర భూషణ్ సింగ్ బుందేలా (గుడ్డు రాజా) ఇతర ముఖ్యమైన నాయకులు. ఝాన్సీ మాజీ ఎంపీ సుజన్ సింగ్ బుందేలా కుమారుడు. గుండు రాజా తన సొంత జిల్లా నుంచి 500 వాహనాలతో ర్యాలీగా వ‌చ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే, రాష్ట్ర మాజీ హోంమంత్రి ఉమాశంకర్ గుప్తా మేనల్లుడు భోపాల్ కు చెందిన డాక్టర్ ఆశిష్ అగర్వాల్, కట్నీకి చెందిన ఛేడిలాల్ పాండే, శివం పాండే, భింద్ కు చెందిన డాక్టర్ కేశవ్ యాదవ్, నర్మదాపురంకు చెందిన మహేంద్ర ప్రతాప్ సింగ్, శివపురికి చెందిన అరవింద్ ధాకడ్, గుణ జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు అన్షు రఘువంశీ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయ‌కుల‌లో ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ స్పీచ్ కి త్రిష ఫిదా | CM Vijay Independence Day Speech