ఢిల్లీలో భూప్రకంపనలు... వరుస ఘటనలతో వణుకున్న ప్రజలు

Siva Kodati |  
Published : May 29, 2020, 09:26 PM IST
ఢిల్లీలో భూప్రకంపనలు... వరుస ఘటనలతో వణుకున్న ప్రజలు

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది.

ఒక్కసారిగా ఇల్లు, భవనాలు తీవ్రంగా కంపించడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. హర్యానాలోని రోహతక్‌లో భూకంప కేంద్రాన్ని భూభౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

కాగా మే 10 ఆదివారం కూడా ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. గత నెలలో కూడా దేశ రాజధానిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ఢిల్లీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families