వివాహితతో అక్రమ సంబంధం.. లేచిపోదాం రమ్మంటే రాలేదని..

By telugu news teamFirst Published Aug 11, 2021, 7:43 AM IST
Highlights

రాజేష్ స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. కాగా.. పూజ గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది.  ఇంట్లోవారేమో మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు.
 

ఆమెకు ఇటీవల పెళ్లైంది. భర్త ప్రేమగానే చూసుకుంటున్నాడు. అయితే.. ఆమెకు గతంలోనే ఓ ప్రేమకథ ఉంది. ప్రేమించిన వాడితో కాకుండా ఇంట్లో వారు మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగినా ఆమె ప్రియుడిని మర్చిపోలేకపోయింది. అందుకే..  అప్పుడప్పుడు తన ప్రియుడితో ఫోన్ లో మాట్లాడేది. ఈ క్రమంలో ఓ రోజు బయట కలుద్దామని అడిగింది. వెంటనే ప్రియుడు ఆమె వద్దకు వాలిపోయాడు. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత.. లేచిపోదాం రమ్మని ప్రియుడు ఆమెను అడిగాడు. అయితే.. అందుకు ఆమె అంగీకరించకపోవడం గమనార్హం. అంతే.. తాను రమ్మంటే రాలేదని.. కోపంతో ఆ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పూజ(21) ఈ ఏడాది ఏప్రిల్ లో రాజేష్ వర్మ అనే యువకుడితో వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. జీడిమెట్లలోని వినాయకనగర్ లో వీరు అద్దెకు ఉంటున్నారు. రాజేష్ స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. కాగా.. పూజ గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది.  ఇంట్లోవారేమో మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు.

అయినా ప్రియుడిని మర్చిపోలేక అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేది. ఇటీవల ప్రియుడ్ని చూడాలని ఉందంటూ హైదరాబాద్ రమ్మని అడిగింది. భర్త లేని సమయంలో.. ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. ఆమె కోరినట్లే.. వెంటనే అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత.. భర్త ను వదిలేసి... తనతో వచ్చేయమని.. లేచిపోయి పెళ్లి చేసుకుందామని పూజను ఆమె ప్రియుడు కోరాడు. అయితే.. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో.. కోపంతో ఆమె ముఖం పై దిండు పెట్టి ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

click me!