కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌: భారత్‌లో అధ్యయనానికి డీసీజీఐ అనుమతి, వెల్లూరులో ప్రయోగాలు

Siva Kodati |  
Published : Aug 10, 2021, 09:29 PM IST
కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌: భారత్‌లో అధ్యయనానికి డీసీజీఐ అనుమతి, వెల్లూరులో ప్రయోగాలు

సారాంశం

కరోనా వ్యాక్సిన్‌లు అయిన కొవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్య వంతులైన వాలంటీర్లపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూరు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలో డీసీజీఐ వ్యాక్సిన్ మిక్సింగ్‌కు అనుమతిని ఇచ్చింది  

భారత్‌లో కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. తమిళనాడులోని వెల్లూరు మెడికల్ కాలేజ్ ఈ ట్రయల్స్ నిర్వహించనుంది. వ్యాక్సినేషన్ కోర్సును పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ఇవ్వగలమా లేదా అన్నదానిపై ఈ అధ్యయనంలో అంచనా వేస్తారు. జూలై 29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయనానికి సిఫారసు చేసింది.

కరోనా వ్యాక్సిన్‌లు అయిన కొవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్య వంతులైన వాలంటీర్లపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూరు మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలో డీసీజీఐ వ్యాక్సిన్ మిక్సింగ్‌కు అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు మిక్స్ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నట్లుగా నివేదికలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం ప్రారంభం కానుంది. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్