మద్యం ప్రియులకు శుభవార్త.. నేటి నుంచి తెరచుకోనున్న దుకాణాలు

Published : Apr 13, 2020, 09:31 AM ISTUpdated : Apr 13, 2020, 09:46 AM IST
మద్యం ప్రియులకు శుభవార్త.. నేటి నుంచి తెరచుకోనున్న దుకాణాలు

సారాంశం

పొరుగున ఉన్న మేఘాలయలో, మద్యం షాపులు మరియు గిడ్డంగులు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సామాజిక దూరం, చేతి పరిశుభ్రత పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.  

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. మళ్లీ దీనిని కొనసాగించే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలు తెరుస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ వార్త మద్యం ప్రియుల్లో ఆనందాన్ని తీసుకువచ్చింది.

Also Read నేను కరోనా రోగినని చెబుతూ.. ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు పడేసి.....

అస్సాం, మేఘాలయలోని మద్యం దుకాణాలు సోమవారం తిరిగి ప్రారంభమవుతాయని ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ విభాగాలు ఆదివారం తెలిపాయి.అస్సాంలో, మద్యం షాపులు, టోకు గిడ్డంగులు, బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీలు, బ్రూవరీస్ సోమవారం నుండి ప్రతిరోజూ ఏడు గంటల పాటు తెరుచుకుంటాయని ఉత్తర్వులో పేర్కొంది.

 పొరుగున ఉన్న మేఘాలయలో, మద్యం షాపులు మరియు గిడ్డంగులు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సామాజిక దూరం, చేతి పరిశుభ్రత పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.

అనుమతి రోజులలో మద్యం షాపులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండాలి. షాపులు బేర్ కనీస సిబ్బందితో పనిచేయవచ్చు. సీసాలు, నగదును నిర్వహించేటప్పుడు వినియోగదారులకు, సిబ్బందికి హ్యాండ్ శానిటైజర్లను అందించవచ్చునని అస్సాం ఎక్సైజ్ విభాగం ఆదేశించింది. మేఘాలయ ఎక్సైజ్ కమిషనర్ ప్రవీణ్ బక్షి అన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాశారు. మద్యం దుకాణాలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేశారు. మద్యం దుకాణాలను తెరవాలని ప్రజలు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా.. రోజూ మద్యం అలవాటు ఉన్నవారు ఈ లాక్ డౌన్ కారణంగా నానా తిప్పలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మద్యం దొరకక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొందరైతే పిచ్చిపట్టిన్లు ప్రవర్తించి.. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేరుతుండటం గమనార్హం. చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుండటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Santal Conference : బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం? మోదీ వర్సెస్ మమత.. అసలేం జరిగింది?