ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది, అది తిని మరణించింది.. దర్యాప్తునకు ఆదేశించిన కేరళ మంత్రి

Published : Jan 07, 2023, 12:39 PM IST
ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది, అది తిని మరణించింది.. దర్యాప్తునకు ఆదేశించిన కేరళ మంత్రి

సారాంశం

కేరళలో ఓ యువతి డిసెంబర్ 31వ తేదీన ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఆ బిర్యానీ తిన్నప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతూనే ఉన్నది. శనివారం ఉదయం మరణించింది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆమె మరణించి ఉండొచ్చని చెబుతున్నారు.  

బెంగళూరు: కేరళలో 20 ఏళ్ల మహిళ డిసెంబర్ 31వ తేదీన ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఆ బిర్యానీ తిన్నాక అనారోగ్యం పాలైంది. చివరికి ఈ రోజు ఉదయం ఓ హాస్పిటల్‌తో పరిస్థితులు విషమించి మరణించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. సదరు రెస్టారెంట్ పై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. ఫుడ్ పాయిజినింగ్‌తో ఆ యువతి మరణించి ఉంటుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

కాసర్‌గోడ్ సమీపంలోని పెరుంబాలాకు చెందిన అంజు శ్రీపార్వతి డిసెంబర్ 31వ తేదీన రొమాన్సియా అనే రెస్టారెంట్ నుంచి బిర్యానీ (కుళిమంతి) కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆ బిర్యానీని ఆమె తినేసింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స పొందుతూనే ఉన్నది. తొలుత ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. ఆ తర్వాత ఆమెను కర్ణాటకకు చెందిన మంగళూరులోని మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలింది.

Also Read: వెజ్ బిర్యానీలో ఎముకలు... రెస్టారెంట్ పై కేసు..!

ఈ ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శ్రీపార్వతి శనివారం తెల్లవారుజామున మరణించిందని చెప్పారు.

కాగా, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని, ఈ ఘటనపై, ఆ యువతికి అందించిన చికిత్సకు సంబంధించిన వివరాలను డీఎంవో పరిశీలిస్తుందని తెలిపారు. 

ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్న హోటళ్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu