కేరళ విమాన ప్రమాదంలో కరోనా అలజడి: హోం ఐసోలేషన్‌లోకి సీఎం విజయన్

Siva Kodati |  
Published : Aug 14, 2020, 08:45 PM IST
కేరళ విమాన ప్రమాదంలో కరోనా అలజడి: హోం ఐసోలేషన్‌లోకి సీఎం విజయన్

సారాంశం

కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం.. ప్రస్తుతం కరోనా అలజడికి కారణమవుతోంది. ప్రమాదంలో సహాయక చర్యలు అందించిన అధికారులు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం.. ప్రస్తుతం కరోనా అలజడికి కారణమవుతోంది. ప్రమాదంలో సహాయక చర్యలు అందించిన అధికారులు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారుల్లో 22 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ జాబితాలో జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, పోలీసులు సైతం ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.

Also Read:కేరళ విమాన ప్రమాదం.. తొలి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందంటే..

ఆ సమయంలో సీఎం వెంట జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు. వీరికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న సీఎం విజయన్‌తో పాటు పలువురు అధికారులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని సీఎం కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ముఖ్యమంత్రి క్వారంటైన్‌లోకి వెళ్లిపోవడంతో శనివారం స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని సీఎంవో వెల్లడించింది.

Also Read:కేరళ విమాన ప్రమాదం: కో పైలట్ మృతి.. 15 రోజుల్లో భార్య డెలీవరి, నిజం దాచిన కుటుంబం

కాగా వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు న 191 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి భారత్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం.. కోజికోడ్‌ విమానాశ్రయంలో రన్‌వే పై నుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

తాతా.. నువ్వు తోపు అంతే ! బ్రిటన్ సామ్రాజ్యానికే అప్పు ఇచ్చిన భారతీయుడు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?