లాక్‌డౌన్ పొడిగించాలా, వద్దా?: ప్రజలను కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Published : May 12, 2020, 02:29 PM IST
లాక్‌డౌన్ పొడిగించాలా, వద్దా?: ప్రజలను కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

సారాంశం

లాక్ డౌన్ పొడిగించాలా, ఎత్తివేయాలా.... ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయమై ప్రజల అభిప్రాయాలను అడిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.


న్యూఢిల్లీ: లాక్ డౌన్ పొడిగించాలా, ఎత్తివేయాలా.... ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయమై ప్రజల అభిప్రాయాలను అడిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

ఈ నెల 17వ తేదీ నాటికి లాక్ డౌన్ ముగియనుంది.లాక్ డౌన్ విషయమై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు విషయమై పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మరో వైపు ప్రజలను ఉద్దేశించి మోడీ మంగళవారం నాడు రాత్రి ప్రసంగించనున్నారు. ఈ నెల 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే విషయమై 1031 నెంబర్ లేదా 8800007722 లేదా delhicm.suggestions@gmail.com కు మెయిల్ చేయాలని సీఎం కోరారు.

also read:ఎయిరిండియా పైలెట్లకు తొలుత పాజిటివ్, ఆ తర్వాత నెగిటివ్: ట్విస్ట్ ఇదీ...

ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపుగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని సీఎం చెప్పారు.లాక్ డౌన్ కారణంగా  ఉపాధి కోల్పోయిన రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

దేశంలోని ఢిల్లీలో కూడ కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న విషయం తెలిసిందే. కరోనాను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. 


 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్