విషమించిన కరుణానిధి ఆరోగ్యం: ఆస్పత్రికి కుటుంబ సభ్యులు

Published : Jul 29, 2018, 10:04 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
విషమించిన కరుణానిధి ఆరోగ్యం: ఆస్పత్రికి కుటుంబ సభ్యులు

సారాంశం

డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ  సభ్యులు, మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకున్నారు. కరుణానిధిని శుక్రవారంనాడు కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. 

చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ  సభ్యులు, మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకున్నారు. కరుణానిధిని శుక్రవారంనాడు కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. 

ముఖ్యమంత్రి పళనిస్వామి తన సేలం పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని చెన్నైకి బయలుదేరారు. కాంగ్రెసు నేత చిదంబరం కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. 

ఆయన ఆస్పత్రిలో చేర్చిన తర్వాత 95 ఆ కురువృద్ధుడి ఫోటోను రెండు రోజుల క్రితం మొదటిసారి విడుదల చేశారు. కరుణానిధి మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. 

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం కరుణానిధిని చూడడానికి వచ్చారు. ఆ సమయంలో తీసిన ఫొటోలో కరుణానిధి నిద్రపోతున్నట్లు కనిపించారు. కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడిందని శనివారంనాడు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. 

కావేరీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ కరుణానిధి ఆరోగ్యంపై ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందని, యాక్టివ్ మెడిక్ సపోర్టుతో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అన్నారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Supreme Court On Protests: పోలీసు లాఠీలకు సుప్రీం బ్రేక్.. ఆందోళనలు చేస్తే కొడతారా?.. సీజేఐ సూర్యకాంత్
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !