పెరుగుతున్న తిరుగుబాట్లు.. ఎన్నిక‌ల వేళ క‌ర్నాట‌క కాంగ్రెస్ కు మరో షాక్..

Published : Apr 10, 2023, 04:27 PM IST
 పెరుగుతున్న తిరుగుబాట్లు.. ఎన్నిక‌ల వేళ క‌ర్నాట‌క కాంగ్రెస్ కు మరో షాక్..

సారాంశం

Karnataka Assembly Election 2023: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కతిల్, కేబినెట్ మంత్రి గోవింద్ కర్జోల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ నేత నాగరాజ్ చబ్బి బీజేపీలో చేరారు. దాదాపు పది మందికి పైగా కీలక నేతలు పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.   

Congress leader Nagaraj Chabbi joined the BJP: ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో క‌ర్నాట‌క లో అన్ని ప్ర‌ధాన రాజకీయ పార్టీలు ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తున్నాయి. అయితే, ఎన్నిక‌ల వేళ క‌ర్నాట‌క కాంగ్రెస్ కు షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు కాషాయ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు నాగరాజ్ చబ్బి, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు సోమ‌వారం నాడు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.

వివరాల్లోకెళ్తే.. కలఘటగి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించిన క్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగరాజ్ చబ్బి ఆదివారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలఘటరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు బీజేపీ టికెట్ గ్యారంటీ ఇచ్చారా లేదా అనేది తెలియరాలేదు.

 

 

మాజీ మంత్రి సంతోష్ లాడ్ కు టికెట్ ఇవ్వడం కేపీసీసీ చీఫ్ విధేయుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ నాగరాజ్ చబ్బి మద్దతుదారులను నిరాశకు గురి చేసిందని సమాచారం. ధార్వాడ్ లో మాజీ మంత్రి వినయ్ కులకర్ణి నామినేషన్ వేయడం ఇస్మాయిల్ తమత్ గార్ ను తమ అభ్యర్థిగా కోరుకున్న ముస్లిం నాయకుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విధేయులకు టికెట్ పంపిణీ చేయడం తిరుగుబాటుకు ఆజ్యం పోసిన మరో అంశంగా ఉంది. 

124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన పార్టీ తిరుగుబాటును అణచివేయగలిగింది. అయితే రెండో జాబితాలో 42 మంది అభ్యర్థుల ఎంపిక పలు నియోజకవర్గాల్లో దుమారం రేపింది. చిత్రదుర్గ, గంగావతి, కడూరు, ధార్వాడ్, గోకాక్, హోళల్కెరె, తుమకూరు సిటీ, మడికేరి, క‌ల‌ఘ‌ట‌రి, చన్నగిరి, తీర్థహళ్లి, బిలగి, బేలూరు, మొలకాల్మూరు, రాజాజీనగర్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థులు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. వేరే పార్టీల నుంచి వ‌చ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంపై పలువురు పార్టీ నేతలు మండిపడుతున్నారు.

జేడీఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేసీ వీరేంద్రకు టికెట్ ఇవ్వడంతో చిత్రదుర్గ మాజీ శాసనసభ్యుడు ఎస్ కే బసవరాజన్ కూడా మనస్తాపానికి గురయ్యారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి యోగేష్ బాబు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎన్ వై గోపాలకృష్ణ నామినేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరిన జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే వైఎస్వీ దత్తా అనుచరులు కడూరులో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టికెట్ నిరాకరించడంతో తన తదుపరి చర్యలపై చర్చించేందుకు దత్తా ఆదివారం తన మద్దతుదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వ‌ర‌లోనే భ‌విష్య‌త్తు నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..