నిరుద్యోగ భృతి పెంపు.. నెలకు రూ.3,500

Published : Jun 19, 2019, 11:17 AM IST
నిరుద్యోగ భృతి పెంపు.. నెలకు రూ.3,500

సారాంశం

నిరుద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తమ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

నిరుద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తమ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు నిరుద్యోగ భృతి పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు నెలకు 3,500 అందించాలని రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదలుకుని ఈ నగదు సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన’ కింద ఈ సాయం అందనుంది. ఈ సాయం పొందాలంటే డిగ్రీ పూర్తి చేసి రాజస్థాన్‌కు చెందిన యవతై ఉండాలి.
 
ఈ స్కీం కింద అర్హులైన యువకులకు నెలకు 3,000 రూపాయలు, యువతులకు, దివ్యాంగులకు 3,500 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నగదు మొత్తం రెండు సంవత్సరాల వరకూ గానీ లేక వారికి ఉద్యోగం వచ్చేంత వరకూ గానీ అందించే అవకాశం ఉంది. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్థాన్ యువతకు కొంత ఊరట లభించినట్లయింది.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !