ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ : జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహ్తో మృతి

Published : Apr 06, 2023, 12:20 PM IST
ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ : జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహ్తో మృతి

సారాంశం

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జాగర్నాథ్ మహ్తో మరణాన్ని ధృవీకరించారు. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.

జార్ఖండ్ : జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహ్తో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. నవంబర్ 2020లో కోవిడ్ బారిన పడిన తర్వాత జగర్నాథ్ మహ్తో ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నాడు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నాయకుడి మరణాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధృవీకరించారు. ఇది "కోలుకోలేని నష్టం" అని ఆయన పేర్కొన్నారు.

"మన పులి జాగర్నాథ్ దా ఇక లేరు. నేడు, జార్ఖండ్ తన గొప్ప ఉద్యమకారులలో ఒకరిని, పోరాట పటిమ కలిగి, కష్టపడి పనిచేసే, ప్రజాదరణ పొందిన నాయకుడిని కోల్పోయింది. గౌరవనీయులైన జాగర్నాథ్ మహతో జీ చెన్నైలో చికిత్స పొందుతూ మరణించారు," అని సోరెన్ ట్వీట్ చేశారు.

ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, ఈ కష్టాన్ని, శోకాన్ని భరించే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ముఖ్యమంత్రి అన్నారు. గిరిదిహ్‌లోని డుమ్రీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మహ్తో గత నెలలో రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో అనారోగ్యం పాలవడంతో ఆయనను వెంటనే విమానంలో చెన్నైకి తరలించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్