ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచలేదు: సీబీడీటీ

Published : Aug 30, 2019, 04:45 PM IST
ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచలేదు: సీబీడీటీ

సారాంశం

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు పెంచలేదని సీబీడీటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీడీటీ తేల్చి చెప్పింది.


న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు పెంచలేదని ఆదాయపన్ను శాఖ ఖండించింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఐటీ శాఖ స్పష్టం చేసింది.

 2018-19  సంవత్సరానికి  రిటర్నులు సమర్పించేందుకు ఆగష్టు 31వ తేదీతో ముగుస్తోందని ఐటీ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొందని సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని సీబీడీటీ ఖండించింది.

ఈ మేరకు సీబీడీటీ శుక్రవారం నాడు ట్వీట్ చేసింది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31. అయితే ఆగష్టు 31వ తేదీ సమయం ఇచ్చిన విషయాన్ని సీబీడీటీ గుర్తు చేసింది.

 

 

PREV
click me!

Recommended Stories

సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu
Blue Moon : ఆకాశంలో అద్భుతం బ్లూ మూన్.. నిజంగానే చందమామ నీలం రంగులోకి మారుతుందా?