ఇస్రో మరో విజయం: విజయవంతంగా నింగిలోకి జీశాట్-11

sivanagaprasad kodati |  
Published : Dec 05, 2018, 08:26 AM IST
ఇస్రో మరో విజయం: విజయవంతంగా నింగిలోకి జీశాట్-11

సారాంశం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పది రోజుల వ్యవధిలో మరో విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏరియన్-5 రాకెట్ ద్వారా దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.  

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పది రోజుల వ్యవధిలో మరో విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏరియన్-5 రాకెట్ ద్వారా దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు కొత్తతరం అప్లికేషన్ల రూపకల్పనకు ఇది వేదికగా నిలుస్తుంది. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సెకనుకు 100 జీబీ డేటా అందించడం ఈ ప్రయోగం ముఖ్యోద్దేశం.

5,854 కిలోల పరిమాణంలో ఉన్న జీశాట్-11 ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల అన్నింటికంటే బరువైనది. ‘‘బిగ్‌బర్డ్’’గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకి రూ.600 కోట్లు ఇస్రో వెచ్చించింది. జీశాట్-11 ప్రయోగ విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో గోనె సంచుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం
Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ