ముంబై తీరానికి సమీపంలో ఇండియన్ నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది సురక్షితం..

Published : Mar 08, 2023, 12:17 PM ISTUpdated : Mar 08, 2023, 12:34 PM IST
ముంబై తీరానికి సమీపంలో ఇండియన్ నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది సురక్షితం..

సారాంశం

భారత నావికాదళానికి చెందిన ఒక హెలికాప్టర్ సముద్ర జలాలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబై సముద్రతీరానికి సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

భారత నావికాదళానికి చెందిన ఒక హెలికాప్టర్ సముద్ర జలాలపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబై సముద్రతీరానికి సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అందులోని ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురు సిబ్బందితో సాధారణ షూటింగులో భారత నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) బుధవారం ముంబై తీరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని నేవీ అధికారి ఒకర తెలిపారు. అందులోని ముగ్గురు సిబ్బందిని నౌకాదళ పెట్రోలింగ్  ఎయిర్‌క్రాఫ్ట్ రక్షించిందని చెప్పారు. 

తక్షణ శోధన, రెస్క్యూ నావికా పెట్రోలింగ్ క్రాఫ్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా కోలుకున్నారని అధికారి తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారి చెప్పారు. అయితే హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ గల  కారణాలు తెలియాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?