తేజస్‌లో విహరించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

Siva Kodati |  
Published : Feb 21, 2019, 02:49 PM IST
తేజస్‌లో విహరించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

సారాంశం

బెంగళూరులో జరుగుతున్ ఏరో ఇండియా షోలో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విహరించారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు. 

బెంగళూరులో జరుగుతున్ ఏరో ఇండియా షోలో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విహరించారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు.

దీనిలో భాగంగా మరో పైలట్‌తో కలిసి రావత్ ఇందులో ప్రయాణించారు. దీనిలో విహరించడానికి వీలుగా ఆయన శిక్షణ తీసుకున్నారు. ఈ యుద్ధవిమానం బుధవారం వాయుసేన అమ్ములపొదిలో అధికారికంగా చేరింది.

తేజస్‌కు సంబంధించిన పూర్తిస్ధాయి నిర్వహణ అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. యుద్ధాల్లో పాల్గొనేందుకు ఈ విమానం సిద్ధంగా ఉందని చెప్పేందుకు నిర్వహణ అనుమతిని జారీ చేస్తారు.

తేజస్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్ యుద్ధ సూట్లతో పాటు పలు రకాల బాంబులు-ఆయుధాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు. 

 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు