India vs Bangladesh: బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భారత్

Published : May 17, 2025, 10:01 PM IST
India vs Bangladesh: బంగ్లాదేశ్ కు షాకిచ్చిన భారత్

సారాంశం

India vs Bangladesh: బంగ్లాదేశ్‌ నుండి వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పోర్ట్ పరిమితులు విధించిన భారత్‌.. నేపాల్, భూటాన్‌కు ట్రాన్సిట్‌కు మినహాయింపు ప్రకటించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్, చైనా వైపు మొగ్గు చూపడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

India vs Bangladesh: భారత్ బంగ్లాదేశ్ కు షాకిచ్చింది. బంగ్లాదేశ్‌ నుండి వస్తువుల దిగుమతులపై పోర్ట్ పరిమితులు విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్ (సిద్దంగా ధరించే వస్త్రాలు), ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తదితర వస్తువుల దిగుమతిపై ఈ పరిమితులు అమలులోకి వస్తున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. "బంగ్లాదేశ్ నుండి దిగుమతులపై పోర్ట్ పరిమితులు అమల్లో ఉంటాయి. ఇది కొన్ని రకాల వస్తువులపై మాత్రమే వర్తిస్తుంది" అని పేర్కొంది. అయితే, ఈ పరిమితులు బంగ్లాదేశ్ నుండి భారత్ ద్వారా నేపాల్, భూటాన్‌కు వెళ్లే ట్రాన్సిట్ సరుకులకు వర్తించవని స్పష్టం చేసింది.

అంటే, బంగ్లాదేశ్ నుండి వస్తువులు భారత్ మీదుగా నేపాల్, భూటాన్ దేశాలకు గమ్యస్థానంగా వెళ్లినప్పుడు, అవి ఈ పోర్ట్ పరిమితుల వల్ల ప్రభావితమవవు. ఈ మేరకు ట్రాన్సిట్ వాణిజ్యానికి మినహాయింపు కొనసాగుతుంది. ఈ చర్య వెనుక వ్యాపార నియంత్రణ, లోకల్ ఉత్పత్తిదారుల రక్షణ వంటి ప్రయోజనాలు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నా, మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు సంబంధించి ప్రత్యేక కారణాలను నోటిఫికేషన్‌లో ప్రస్తావించలేదు.

ఈ కొత్త పరిమితుల అమలుతో బంగ్లాదేశ్‌ నుండి వచ్చే కొన్ని రకాల దిగుమతులపై భారత దిగుమతిదారులు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో నేపాల్, భూటాన్‌ దేశాలకు చెందిన వ్యాపార వ్యవహారాలు సాధారణంగానే కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న వాణిజ్య మార్గాలను దృష్టిలో పెట్టుకొని, ఈ మార్పులు లోగడ ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగానే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం త్వరలో మరింత స్పష్టతతో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

 

కోల కతా, ముంబై ఓడరేవుల ద్వారా మాత్రమే వీటిని అనుమతిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఏటా $700 మిలియన్లకు పైగా విలువైన బంగ్లాదేశ్ దుస్తుల దిగుమతికి గతంలో ఉపయోగించిన అన్ని భూ సరిహద్దులు మూతపడ్డాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాత్కాలిక యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల విధించిన వాణిజ్య ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ చర్య కనిపిస్తోంది. ఏప్రిల్ 13న, బంగ్లాదేశ్ భారతీయ నూలు ఎగుమతులను ఓడరేవులకు మాత్రమే పరిమితం చేసింది, భూ సరిహద్దుల ద్వారా ప్రవేశించకుండా నిషేధించింది. అదనంగా, భారతీయ ఎగుమతులు కఠిన తనిఖీలను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ 15 నుండి హిలి, బెనపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల (ICP) ద్వారా బియ్యం ఎగుమతులను నిలిపివేశారు.

షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, తాత్కాలిక యూనస్ పరిపాలన అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. కొత్త పాలన పాకిస్తాన్, చైనాకు చేరువ కావడం, ఇటీవలి భారత వ్యతిరేక వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tamilnadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu