ప్రపంచంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉన్న ఏకైక దేశం భారత్: జీ20 ఎంపవర్ గ్రూప్ మీట్ లో స్మృతి ఇరానీ

Published : Feb 12, 2023, 12:39 PM IST
ప్రపంచంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉన్న ఏకైక దేశం భారత్: జీ20 ఎంపవర్ గ్రూప్  మీట్ లో స్మృతి ఇరానీ

సారాంశం

Lucknow: ప్రపంచంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్ర‌మేన‌ని జీ-20 ఎంపవర్ గ్రూప్  మీట్ లో స్మృతి ఇరానీ అన్నారు. జీ-20 ఎంపవర్ గ్రూప్ ఆవిర్భావ సమావేశం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో జ‌రిగింది.   

Inception meeting of G20 Empower Group: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జీ-20 సాధికార బృందం రెండు రోజుల ప్రారంభ సమావేశం శనివారం (ఫిబ్రవరి 11) జరిగింది. 13 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్ర‌యివేటు రంగానికి చెందిన మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్ర‌మేన‌ని జీ20 ఎంపవర్ గ్రూప్  మీట్ లో స్మృతి ఇరానీ అన్నారు. 

జీ20 ఎంపవర్ గ్రూప్  మీట్ తొలిరోజు సమావేశం గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, 'మహిళా నాయకత్వం, వ్యవస్థాపకత, శ్రామిక శక్తితో డిజిటల్ నైపుణ్యాలు, భవిష్యత్తు నైపుణ్యాల పాత్రపై చర్చ జరిగింది. ప్రపంచంలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న దేశం భారత్ మాత్రమేన‌ని" అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు.  "ప్రధాని మోడీ పార్లమెంటులో సమాధానం ఇచ్చారు, అతని కింద భూమి జారిపోయిందో లేదో తనకు తెలియదు" అని అన్నారు.  

దేశంలో జీ20 సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ కోణాలపై చర్చించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జీ-20 సాధికారత కోసం భారతదేశ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి జీ-20 ఎంపవర్ 2023 చైర్మన్ గా ఉన్నారు. 

 

జీ20 ఎంపవర్ గ్రూప్  సమావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలివే..

1. థీమ్: అన్ని రంగాల్లో నాయకత్వం వహించడానికి మహిళల సాధికారత: డిజిటల్ స్కిల్స్-ఫ్యూచర్ స్కిల్స్ పాత్ర గా తీసుకున్నారు.

2. భారత అధ్యక్షతన జీ-20 ఎంపవర్ 2023 మహిళా అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి పరివర్తనకు ప్రాధాన్యత ఇస్తోంది.

3. జీ-20 ఎంపవర్ 2023 సవాళ్లను మహిళల నేతృత్వంలోని ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు వేగంగా మార్చడానికి, శ్రామిక శక్తిలో మహిళలను ఎక్కువగా చేర్చడానికి అవకాశాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

4. రెండు రోజుల జీ-20 ఎంపవర్ అసెంబ్లీ సమావేశంలో జరిగే చర్చలు వరుస సమావేశాలకు నేపథ్యాన్ని ఏర్పరుస్తాయి. అన్ని స్థాయిలలో మహిళల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.

5. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా నేతృత్వంలోని సూక్ష్మ సంస్థలు, మహిళా హస్తకళాకారులు, చేతివృత్తుల వారి కృషిని ప్రదర్శించడానికి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!