ఇండియా దేశం కాదు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదు: డీఎంకే ఎంపీ రాజా షాకింగ్ కామెంట్స్

Published : Mar 05, 2024, 02:30 PM IST
ఇండియా దేశం కాదు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదు: డీఎంకే ఎంపీ రాజా షాకింగ్ కామెంట్స్

సారాంశం

డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది దేశం కాదని, భారత్ ఒక ఉపఖండం అని వివరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉనికే ఉండదని అన్నారు.  

డీఎంకే లోక్ సభ ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనేది ఒక దేశం కాదని పేర్కొంటూ కొత్త వివాదాన్ని రేపారు. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అనే నినాదాలను ఆయన తప్పుపట్టారు. ఏ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. హిందూయిజం అనేది దేశానికి, అలాగే ప్రపంచానికి కూడా ఒక సమస్యే అని పేర్కొన్నారు. తాజాగా, మరోసారి ఆయన వివాదాన్ని రేపారు.

ఇండియా అనేది ఒక దేశం కాదని ఏ రాజా అన్నారు. అయితే, ఇది ఒక ఉపఖండం అని వివరించారు. తమిళం ఒక దేశం, మలయాళం ఒక దేశం, ఒడియా ఒక దేశం.. ఇలా అనేక దేశాలతో ఏర్పడిందే భారత ఉపఖండం అని తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి ఈ ఉనికే గల్లంతు అవుతుందని పేర్కొన్నారు.

Also Read: LokSabah Polls: తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఒపీనియన్ పోల్స్ అంచనాలివే

బీజేపీ ఐటీ శాఖ హెడ్ అమిత్ మాలవీయా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. డీఎంకే నుంచి వరుసగా విద్వేష ప్రసంగాలే వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపు ఇచ్చారని, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ ఏ రాజా మరో వివాదాన్ని రేపారని తెలిపారు. డీఎంకే నుంచి ఒక క్రమబద్ధంగానే విద్వేష పూరిత వ్యాఖ్యలు వస్తున్నాయని, వీటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?