ఇండియాకు వస్తున్న ఫ్లైట్ పాకిస్తాన్‌కు డైవర్ట్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?

Published : Oct 15, 2023, 09:57 PM IST
ఇండియాకు వస్తున్న ఫ్లైట్ పాకిస్తాన్‌కు డైవర్ట్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?

సారాంశం

దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ శనివారం సడన్‌గా పాకిస్తాన్‌లోని కరాచీకి డైవర్ట్ చేయాల్సి వచ్చింది. కరాచీ ఎయిర్‌పోర్టులో రెండు గంటల పాటు గడిపిన తర్వాత తిరిగి అమృత్‌సర్‌కు ఆ ఫ్లైట్ బయల్దేరింది.   

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 14 వ తేదీన ఉదయం 8.51 గంటలకు (స్థానిక కాలమానం) దుబాయ్ నుంచి ఇండియాకు బయల్దేరింది. ఆ ఫ్లైట్ అమృత్‌సర్‌కు రావాల్సి ఉన్నది. కానీ, దాన్ని అకాస్మాత్తుగా పాకిస్తాన్‌లోని కరాచీకి డైవర్ట్ చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఆ ఫ్లైట్ రెండు గంటల తర్వాత తిరిగి అమృత్‌సర్‌కు బయల్దేరింది. అసలేం జరిగిందంటే?

దుబాయ్ నుంచి బయల్దేరిన కొన్ని గంటల తర్వాత ఆ ఫ్లైట్‌లోని ఓ ప్రయాణికుడికి అనారోగ్య సమస్య వచ్చింది. వెంటనే వైద్య సేవలు అందించాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఫ్లైట్ సిబ్బంది సమీపంలోని ఎయిర్‌పోర్టును పరిశీలించగా.. సమీపంగా కరాచీ ఎయిర్‌పోర్టును గుర్తించింది. వెంటనే ఫ్లైట్‌ను కరాచీకి డైవర్ చేసింది.

Also Read: ‘హమాస్‌కు ఎలాంటి గతి పడుతున్నదో చూడండి’.. లెబనాన్ నుంచి దాడి చేస్తున్న హెజ్బోల్లాకు ఇజ్రాయెల్ వార్నింగ్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వస్తున్న విమానంలో ఓ పేషెంట్‌కు అత్యవసర వైద్య సేవలు అవసరం వచ్చాయని, వెంటనే ఆ సమయంలో సమీపంలోని కరాచీ ఎయిర్‌పోర్టుకు విమానాన్ని తరలించారని వివరించారు. తాము ఆ ఎయిర్‌పోర్టు అధికారులతో సమన్వయంలోకి వెళ్లామని, తమ ప్రయాణికుడికి వెంటనే వైద్య సేవలు అందించామని తెలిపారు. కరాచీ ఎయిర్‌పోర్టులోని వైద్యుడు ఆ ప్రయాణికుడికి చికిత్స అందించాడని, ఆ ప్రయాణికుడు మళ్లీ తన విమాన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగానే ఉన్నాడనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫ్లైట్ అమృత్‌సర్‌కు బయల్దేరిందని వివరించారు.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations